కాకినాడ జిజిహెచ్ కు ఎంఆర్ఐ, క్యాథ్ ల్యాబ్ యూనిట్..


Ens Balu
4
Kakinada
2021-12-13 17:16:47

తూర్పుగోదావరి జిల్లా కేంద్రంలోని కాకినాడ జిజిహెచ్ కు అధునాతన ఎంఆర్ఐ, క్యాత్ ల్యాబ్ యూనిట్ రాబోతుంది. ఈ మేరకు సోమవారం అమరావతిలోని సీఎం క్యాంపు కార్యాలయలో సీఎం వైఎస్.జగన్మోహనరెడ్డి అధ్యక్షతన జరిగిన ఆరోగ్యశాఖ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆ విషయాన్ని ముఖ్యమంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో తెలియజేసింది. ఒకప్పుడు కార్పోరేట్ ఆసుపత్రుల్లో మాత్రమే అందుబాటులో ఉండే ఎంఆర్ఐ, క్యాత్ ల్యాబ్ యూనిట్లు కాకినాడ జిజిహెచ్ కు మంజూరు కావడంతో నిరుపేద రోగులకు కార్పోరేట్ స్థాయి వైద్యం ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే అందే అవకాశాలున్నాయి. ఎంఆర్ఐ యూనిట్ కాకినాడకు మంజూరు చేయడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తం అవుతున్నది.