డయల్ యువర్ కమిషనర్ కి18 ఫిర్యాదులు


Ens Balu
2
జివిఎంసి ప్రధాన కార్యాలయం
2020-09-14 20:47:25

డయల్ యువర్ కమిషనర్ కార్యక్రమానికి వచ్చిన వినతులపై సంబంధిత శాఖల అధికారులు తక్షణమే స్పందించి, సమస్య పరిష్కరించాలని జెడి విజయభారతి( అమృత్) అన్నారు. సోమవారం  జి.వి.ఎం.సి. ప్రధాన కార్యాలయం నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఫోన్ ద్వారా ప్రజల నుంచి విజ్ఞప్తులు స్వీకరించారు. స్వీకరించిన విజ్ఞప్తులను స్వయంగా పరిష్కరించి తగు నివేదిక వెంటనే సమర్పించు నిమిత్తం ఆయా విభాగాల అధికారులను/జోనల్ కమిషనర్లకు పంపించారు. ఇందులో 1వ జోనుకు సంబందించి 03, 2వ జోనుకు సంబందించి 03, 3వ జోనుకు సంబందించి 03, 4వ జోనుకు సంబందించి 02, 5వ జోనుకు సంబందించి 03, 6వ జోనుకు సంబందించి 03, పి.డి.(యు.సి.డి) సంబందించి 01, మొత్తము 18 ఫిర్యాదులు ఫోను ద్వారా స్వీకరించారు. ఈ ఫిర్యాదులను పరిశీలించిన ఆమె ప్రధాన కార్యాలయ విభాగపు ఉన్నతాధికారులతోను, జోనల్ కమిషనర్లతోను మాట్లాడుతూ, ఫిర్యాదులు 03రోజులలో పరిష్కరించేందుకుగాను తగు ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశించారు.