అక్రిడేటెడ్ జర్నలిస్టులందరూ వర్కింగ్ జర్నలిస్ట్ హెల్త్ స్కీమ్ ప్రీమియం చెల్లించాలి..


Ens Balu
8
Visakhapatnam
2022-01-20 10:35:46

రాష్ట్ర ప్రభుత్వం వర్కింగ్ జర్నలిస్టు హెల్త్ స్కీమ్ ను 2021-22 ఆర్థిక సంవత్సరానికి పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసిందని, 31 మార్చి 2022 వరకు అమలులో ఉండే ఈ పధకానికి  జర్నలిస్టు వాటాగా రూ. 1250 చెల్లిస్తే, ప్రభుత్వం మరో రూ. 1250 లను చెల్లిస్తుందని కమిషనర్ తుమ్మా విజయకుమార్ రెడ్డి తెలియజేశారని విశాఖజిల్లా సమాచారశాఖ డిడి మణిరామ్ ఒక ప్రకటనలో తెలియజేశారు. అక్రిడిటేషన్ల మంజూరుకు అడ్డంకులు తొలగిన నేపధ్యంలో జర్నలిస్టులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆ ప్రకటనలో కోరారు.  జర్నలిస్టులు cfms.ap వెబ్ సైట్ నందు DDO Code: 8342 – 00 – 120 -01-03-001-001 VN, DDO Code : 2703 – 0802 – 003 నందు తమ వాటాను చెల్లించాల సూచించారు. ప్రీమియం చెల్లించిన జర్నలిస్టులు ఒరిజనల్ చలానా, అక్రిడిటేషన్ కార్డు జిరాక్సు కాపీ, రెన్యువల్ జర్నలిస్టులయితే హెల్త్ కార్డు జిరాక్స్ కాపీలను విశాఖజిల్లా కేంద్రంలోని సమాచార, పౌరసంబంధాల శాఖ  కార్యాలయంలోనూ అందజేయవలసిందిగా ఆ ప్రకటనలో తెలియజేశారు. కొత్తగా అక్రిడిటేషన్ పొందినవారు  వారి కుటుంబంలో అర్హత కలిగిన వ్యక్తుల ఆధార్ కార్డు కాపీ, ఫొటోలు కూడా జతచేయాలని సూచించారు.