సమాచారశాఖలో ఉత్తమ ఏపీఆర్వో గా కిషోర్ కి అవార్డు..


Ens Balu
6
Visakhapatnam
2022-01-26 13:00:21

విశాఖజిల్లా సమాచారశాఖలో ఏపీఆర్వోగా పనిచేస్తున్న కిషోర్ కి ఉత్తమ ఉద్యోగి అవార్డు వచ్చింది. విధినిర్వహణలో చురుకుదనం, జర్నలిస్టులకు సకాలంలో సేవలు అందించడం వెరస ఆయను జిల్లా అధికారులు గుర్తించారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా పోలీస్ బేరక్స్ లో జరిగిన ఉత్సవాల్లో కిషోర్ కి ఉత్తమ అవార్డును జిల్లా కలెక్టర్, జివిఎంసీ కమిషర్ డా.లక్ష్మీషాలు సంయుక్తంగా అందజేశారు. కిషోర్ కి ఉత్తమ అవార్డు రావడం పట్లు పలువురు జర్నలిస్టులు, సమాచారశాఖలోని సహచర ఉద్యోగులు హర్షం వ్యక్తం చేశారు. రానున్న రోజుల్లో మరిన్ని అవార్డులు తీసుకోవాలని ఆకాంక్షించారు.