విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన హోంగార్డు ఆర్.ఎస్.ఎస్ శివ కుటుంబానికి జిల్లా మెరైన్ హోంగార్డులు అందించిన తమ ఒక్క రోజు జీతం మొత్తం రూ.12,780/-ల చెక్కును వారి భార్య ఆర్. దేవికి అడిషనల్ ఎస్పీ(అడ్మిన్) కరణం కుమార్ అందజేశారు. శనివారం జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వపరంగా మ్రుతి చెందిన కుటుంబ సభ్యులకు రావలసిన అన్ని రాయితీలు సత్వరం వచ్చేలా చర్యలు తీసుకుంటామని తెలియజేశారు. ఈ కార్యర్రమంలో పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.