ప్రాధాన్యత ప్రాజెక్టుగా హై లెవెల్ కెనాల్..
Ens Balu
3
Srikakulam
2020-09-15 19:57:18
శ్రీకాకుళం జిల్లాలోని వంశధార–నాగావళి అనుసంధాన హైలెవెల్ ప్రాజెక్టును ప్రాధాన్యతా రంగ ప్రాజెక్టుగా ముఖ్య మంత్రి ప్రకటించారని రాష్ట్ర శాసన సభాపతి తమ్మినేని సీతారాం తెలిపారు. బూర్జ మండలం లంకం, చిన్న లంకం వద్ద వంశధార నాగావళి అనుసంధానం జరుగుతున్న హై లెవెల్ కెనాల్ ను సభాపతి మంగళ వారం సందర్శించారు. అనంతరం రైతులతో భూసేకరణపై సభాపతి చర్చించారు. హిర మండలం వద్ద వంశధార నుండి నాగవళి లో నారాయణపురం ఆనకట్ట ఎగువన కలుస్తుందని, చీడివలస నుండి చినలంకం వరకు సుమారుగా 5 వేల ఎకరాలకు కొత్తగా సాగు నీరు అందుతుందని చెప్పారు. గజ్జల గెడ్డ, దేశయగెడ్డ,ఓని గెడ్డలకు ప్రతి సంవత్సరం వరద సమయంలో ముంపుకు గురవుతున్నాయని ఈ సమస్యకు కొంత మేర పరిష్కారం లభిస్తుందని ఆయన చెప్పారు. కాలువ దిగువన కొల్లివలస - నారాయణపురం రోడ్డు నీరు వెళ్లక ముప్పు గురవుతారని రైతులు సభాపతి దృష్టికి తీసుకు వెళ్ళారు. చీడివలస దిగువ నుండి నీరు పోవటానికి 3 అండర్ టర్నల్ ప్రతిపాదన ఉన్నాయని, వాటి సామర్ధ్యం ను పెంచాలని సభాపత్ తమ్మినేని అధికారులకు సూచించారు. దిగువన ఉన్న రోడ్డు ఎత్తు పెంచి కల్వర్టులు నిర్మిస్తామని రైతులకు తెలిపారు. హై లెవెల్ కాలువ నిర్మాణం వలన రైతులకు మేలు జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. పెద్ద పెట వద్ద ఎత్తిపోతల పథకాన్ని కూడా ప్రతిపాదించామని ఆయన పేర్కొన్నారు. హై లెవెల్ కెనాల్ ను పూర్తి చేయాల్సిన అవసరం ఉందన్నారు. వంశధార పర్యవేక్షక ఇంజనీరు పి.రంగారావు హైలెవెల్ కాలువ నిర్మాణ వివరాలను వివరించారు. భూ సేకరణకు సంబంధించి కొంత మేర చెల్లింపులు పెండింగులో ఉన్నాయన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా బాలుర క్రికెట్ సంఘం అధ్యక్షులు తమ్మినేని చిరంజీవి నాగ్, భూ సేకరణ ఉప కలెక్టర్ కాశీవిశ్వనాథ రావు, జలవనరుల శాఖ ఇంజనీర్లు, రైతులు తదితరులు పాల్గొన్నారు