క్రిష్ణదేవిపేటలో ఏప్రిల్ 3న 1997 బ్యాచ్ ఓల్డ్ స్టూడెంట్స్ గెట్ టు గెదర్ మీట్..


Ens Balu
4
Visakhapatnam
2022-03-15 04:01:34

విశాఖజిల్లా, గొలుగొండ మండలం, క్రిష్ణదేవిపేట హైస్కూలులో చదువుకున్న 1997 ఓల్డ్ స్టూడెంట్స్ గెట్ టు గెదర్ మీట్  కార్యక్రమం ఏప్రిల్ 3వ తేదిన అదే గ్రామంలోని అల్లూరి సీతారామరాజు థీమ్ పార్కులో ఏర్పాటు చేసినట్టు కో-ఆర్డినేషన్ కమిటీ సభ్యులు పి.బాలభాను(ఈఎన్ఎస్ బాలు), ఎర్రానాగేశ్వర్రావులు తెలియజేశారు. ఈ మేరకు వారు విశాఖలో మీడియాకి ప్రకటన విడుదల చేశారు. తమ బ్యాచ్ కి పదవతరగతి పూర్తయి 25ఏళ్లు పూర్తయిన సందర్భంగా క్లాస్ మేట్స్ సభ్యులంతా కలవాలని నిర్ణయించుకున్నట్టు పేర్కొన్నారు. కోవిడ్ కారణంగా కాస్త ఆలస్యమైందని..ఈ కారణంగానే ఇంకా కొంతమంది స్నేహితుల వివరాలను సేకరించలేకోయామని పేర్కొన్నారు. క్రిష్ణదేవిపేట జెడ్పీ హైస్కూలులో 1997కి బ్యాచ్ 10వ తరగతి విద్యార్ధులు ఇంకా ఎవరైనా ఉంటే తక్షణమే ఈఎన్ఎస్ బాలు 9490280270, 9390280270,  నాగేశ్వర్రావు 8187897203, అసూన్ 9491784482 నెంబర్లలో సంప్రదించాలని కోరారు. ఆ రోజు జరిగే కార్యక్రమానికి తమ బ్యాచ్ సభ్యులు ఎక్కడున్నా కలసి కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా వారు ఆ ప్రకటనలో కోరారు.