మహిళల ఆర్ధిక స్వావలంబనకు వైఎస్సార్ ఆసరా..
Ens Balu
2
Srikakulam
2020-09-17 15:49:56
మహిళల ఆర్ధిక స్థితిగతులను పెంచి ఆర్ధిక స్వాతంత్య్రం రావాలనే ఉద్దేశ్యంతో వై.యస్.ఆర్.ఆసరా పథకాన్ని ప్రారంభించడం జరిగిందని మాజీ మంత్రి, శ్రీకాకుళం శాసనసభ్యులు ధర్మాన ప్రసాదరావు పేర్కొన్నారు. గురువారం ఉదయం చాపురం పంచాయతీ, గోవింద్ నగర్ కాలనీ లో వై.యస్.ఆర్. ఆసరా వారోత్సవాల కార్యక్ర మం జరిగింది. ఈ కార్యక్రమానికి శాసనసభ్యులు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. అనంతరం వై.ఎస్.ఆర్ ఆసరా పథకం ద్వారా ఏర్పాటు చేసిన కిరాణా దుకాణాన్ని శాసనసభ్యులు ధర్మాన ప్రసాదరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలను ఆర్ధిక స్వావలంబన దిశగా తీసుకువెళ్లాలనేది ప్రభుత్వ లక్ష్యమని, వారి ఆర్థికస్థితి గతులు పెంచి, ఆర్థిక స్వతంత్రం రావాలని ప్రభుత్వం కోరుకుంటుందని అన్నారు. ఒక కుటుంబంలోని మహిళలు బాధ్యతగా వ్యవహరి స్తారని, అటువంటివారికి అవసరమైన శక్తిని అందించాలని ప్రభుత్వం భావిస్తోందన్నారు. అలాంటి భావజాలానికి అనుకూలంగానే ప్రభుత్వం ఇన్నిరకాల పథకాలకు రూపకల్పన చేసిందని చెప్పారు. 45 ఏళ్ళు పైబడిన మహిళలకు వై.ఎస్.ఆర్ చేదోడు ద్వారా రూ.18,750 డబ్బు ఇచ్చినా, ఇప్పటి వరకు వ్యాపారం చేస్తున్న వారికి రూ.75,000/-లను తక్కువ వడ్డీకే అందించి డీ సెంట్రలైజ్ చేసి దానితో మల్టీ నేషనల్ కంపెనీలతో టైఅప్ అయ్యి వారి దగ్గర కొన్న సరుకులు, తక్కువ ధరకే అందించి ఎక్కువ ప్రయోజనం పొందే విధంగా చేసే ఏర్పాట్లన్నీ దీనిలో భాగమేనని ఆయన తేల్చిచెప్పారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వై.యస్. జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక కార్యక్రమాలు చేపట్టారని, ఏ బలమైన సమాజానికి మహిళలే ఆయువుపట్టు అని గుర్తించి, వారికి ఆర్థిక స్వతంత్రం కలిగి ఉండేలా చేయడం, వారి సామాజిక స్థితిగతులు మెరుగుపరచడం, పేదలకు ఆదుకునే ప్రభుత్వం ఉంది అనే ధైర్యాన్ని అందించేందుకు ఇలాంటి పథకాలు అవసరం అని ఆయన అభిప్రాయపడ్డారు. సంపాదన చేసుకోడానికి మహిళలు ముందుకు రావడం ద్వారా కుటుంబంలో ప్రముఖ పాత్ర నిర్వహిస్తున్నారని తెలిపారు. పెద్ద ఎత్తున ఇంత ధనాన్ని ప్రభుత్వ పధకాల ద్వారా పేదలకు అందచేసే ప్రక్రియ ఇలానే ఈ ప్రభుత్వం ఆధ్వర్యంలో కొనసాగుతుందని చెప్పారు. దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇంత పెద్ద ఎత్తున మహిళలు కోసం ధనాన్ని కేటాయించిన కార్యక్రమాలు లేవని, ఈరోజు మన రాష్ట్రంలో జరుగుతున్నాయని కితాబిచ్చారు. దీర్ఘ కాలంలో దీని తాలుకా ప్రయోజనాలు మనకి స్పష్టంగా కనిపిస్తాయని అన్నారు. సమాజాభివృద్ధికి, కుటుంబాల అభివృద్ధికి మరింత ఆర్థిక స్వాతంత్య్రానికి, సామాజిక స్థితిగతులు పెరగడానికి ముఖ్యంగా మహిళకు ప్రయోజనంగా ఈ పథకాలు ఉంటాయని ఆయన స్పష్టం చేసారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ పథక సంచాలకులు బి.నగేష్ , ఏరియా కో ఆర్డినేటర్ కొండలరావు, మండల మహిళా సమాఖ్య అధ్యక్షురాలు పి కొటేశ్వరమ్మ, కోశాధికారి హేమలత, ఏ.పి.ఎం త్రినాధమ్మ , అల్లు లక్ష్మీనారాయణ ,ముకళ్ల తాతబాబు ,గుడ్ల దాము ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.