థర్మల్ స్క్రీనింగ్ తరువాతే లోనికి అనుమతి...
Ens Balu
3
Tirupati
2020-09-17 16:29:41
సచివాలయ పరీక్షా కేంద్రాల్లో తప్పని సరిగా అభ్యర్ధులకు థర్మల్ స్క్రీనింగ్ నిర్వహించిన తరువాత మాత్రమే లోపలికి అనుమతించాలని తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ గిరీష అధికారులను ఆదేశించారు. ఈ నెల 20 నుంచి జరగనున్న సచివాలయ పరీక్షల నిర్వహణపై గురువారం వై.ఎస్.ఆర్. భవన్ నోడల్ ఆఫీసర్స్ తో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, అభ్యర్థులకు పరీక్షా కేంద్రాల వద్ద ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. గట్టి బందోబస్తు మధ్య పకడ్బందీగా ఈ పరీక్షలు నిర్వహించేందుకు అందరూ సహకరించాలన్నారు. పరీక్ష కేంద్రాల వద్ద పరీక్షకు వచ్చే విద్యార్థులు వారి తల్లిదండ్రులు పరీక్ష కేంద్రాలు వెలుపలే ఉండేలా చూడాలన్నారు. ప్రతి సెంటర్ లో సెల్ ఫోన్ నిషేధించి ప్రతి సెంటర్లో ఒక వీడియో గ్రాఫర్ ని గ్రాఫర్ ఏర్పాటుచేసి పరీక్ష మొత్తం వీడియోలు తీయించాలన్నారు. శానిటరీ సిబ్బంతితో ఎప్పటికప్పుడు శుభ్రం చేయించాలన్నారు. భౌతిక దూరం తోనే పరీక్షలు నిర్వహించాలన్న ఆయన ఈ రెండు రోజులు 37 సెంటర్లును పరిశీలించి సదుపాయాలు కల్పించే విధంగా ప్రణాళిక చూడాలని ఆదేశించారు. ప్రతి సెంటర్లో మరుగుదొడ్లు, లైట్లు, ఫ్యాన్లు, వెలుతురు వుండాలని మరియు మీకు ఇచ్చిన బాధ్యత సక్రమంగా నిర్వహించాలని, ఎలాంటి లోటుపాట్లు ఉన్నా మీ మీద చర్యలు తీసుకోవలసి వస్తుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ వారితో పాటు అదనపు కమిషనర్ హరిత, ఉప కమిషనర్ చంద్రమౌళీశ్వర రెడ్డి, అర్బన్ తాసిల్దార్ వెంకటరమణ, ఎంఈఓ సత్యనారాయణ, హెల్త్ ఆఫీసర్ సుధారాణి, మేనేజర్ హసీమ్, డీ ఈ లు విజయ్ కుమార్ రెడ్డి, గోమతి, శానిటరీ సూపర్వైజర్ గోవర్ధన్, ఏర్పేడు, కెవిబిపురం, చిన్నగొట్టిగల్లు తాసిల్దార్ లు, స్పెషల్ ఆఫీసర్లు పాల్గొన్నారు.