అప్పన్నకు తొలివిడత చందనం.. గంట్ల


Ens Balu
3
Simhachalam
2022-04-20 05:16:33

ఉత్తరాంధ్ర జిల్లాల ప్రజల ఆరాధ్య దైవం, భక్తకోటి ఇలవేల్పు సింహాచలం శ్రీశ్రీశ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆలయంలో మే మూడున అప్పన్న నిజరూప దర్శనం ఉత్సవము జరగనుంది.ప్రతి ఏటా వైశాఖ శుద్ధ తదియనాడు సాంప్రదాయబద్ధంగా నిర్వహించే ఈ ఉత్సవం ఈ ఏడాది కూడా ఆలయ ఈవో ఎంవీ సూర్య కళ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించనున్నట్లు అప్పన్న ధర్మకర్తల మండలి సభ్యులు, జాతీయ జర్నలిస్ట్ లు సంఘం కార్యదర్శి, వైజాగ్ జర్నలిస్ట్ లు ఫోరమ్ అధ్యక్షుడు గంట్ల శ్రీను బాబు తెలిపారు. బుధవారం సింహాద్రినాధుడు ను దర్శించుకున్న అనంతరం ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ, ఇందుకు సంబంధించి ఈ నెల 26న తొలివిడత చందనం అరగతీత కార్యక్రమం వైభవంగా ప్రారంభం కానుందన్నారు.. ఏకాదశి పర్వదినం  రోజున నిర్వహించే ఈఉత్సవాలకు సంబంధించి ఆలయ వర్గాలు చురుగ్గా ఏర్పాట్లు చేస్తున్నాయన్నారు. ఆ రోజు తెల్లవారుజామున సింహాద్రి నాథుడు, శ్రీదేవి, భూదేవి అమ్మవార్లును సుప్రభాతసేవతో మేల్కొలిపి ఆరాధన గావిస్తారన్నారు... అనంతరం గంగ ధార నుంచి  తీసుకొచ్చిన పవిత్ర జలాలతో అభిషేకం నిర్వహించి, విశ్వక్షేన , పుణ్యహవచనం ఆరాధన అనంతరం తొలివిడత చందనం అరగతీత కార్యక్రమాన్ని ప్రారంభిస్తారన్నారు.... చందనోత్సవం రోజు రాత్రికి తొలివిడత చందనం సమర్పణ  గావించి, ఆ తర్వాత వచ్చే వైశాఖ, జ్యేష్ఠ, ఆషాడ పౌర్ణమిలలో మూడేసి మణుగుల చొప్పున మొత్తం  ఏడాదిలో నాలుగు  విడతల  కింద 12 మణుగుల చందనాన్ని (500కేజీలు) స్వామికి సమర్పించడం సంప్రదాయబద్ధంగా వస్తుందన్నారు.. ఆలయ అధికారులు ,ధర్మకర్తల మండలి సభ్యులు ఇందుకు సంబంధించి ఏర్పాట్లు చేస్తున్నట్లు శ్రీను బాబు మీడియాకి వివరించారు.