ప్రతీ ఒక్కరికీ ఆరోగ్య సేవలే లక్ష్యం..


Ens Balu
6
Visakhapatnam
2022-04-20 09:28:11

ప్రతి ఒక్కరూ సంపూర్ణ ఆరోగ్య వంతులుగా ఉండాలనే ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ లో భాగంగా ప్రతీ జిల్లాలో ఆరోగ్య మేళాలు నిర్వహిస్తున్నట్టు విశాఖ నగర మేయర్ గొలగాని హరి వెంకట కుమారి  తెలిపారు. బుధవారం ఆమె నగరంలోని స్వర్ణ భారతి ఇండోర్ స్టేడియం లో ఏర్పాటుచేసిన ఆరోగ్య మేళాను జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ. మల్లికార్జున్ విమ్స్ డైరెక్టర్ డాక్టర్ కే. రాంబాబు డి ఎం హెచ్ ఓ డాక్టర్ విజయలక్ష్మి ఆధ్వర్యంలో మేళాను ప్రారంభించారు. ఈ సందర్భంగా మేళాలో వైద్య ఆరోగ్య శాఖ అనుబంధ సంస్థల ఏర్పాటు చేసిన స్టాల్స్ ను సందర్శించారు. సాధారణ వ్యాధులతో పాటు దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు కూడా సకాలంలో మెరుగైన వైద్యం అందించాలన్నాదే ప్రభుత్వ లక్ష్యమని, దీనిలో భాగంగానే ఈ మేళాను నిర్వహిస్తున్నారని తెలిపారు. అర్హులై ఉండి ఆరోగ్యశ్రీ కార్డులు అందని వారికి సకాలంలో కార్డులు అందజేసే విధంగా ప్రత్యేక కౌంటర్ను ఏర్పాటు చేశామన్నారు. ఈ అవకాశాన్ని నగర ప్రజలు  అధిక సంఖ్యలో సద్వినియోగం చేసుకుంటున్నారని తెలిపారు.  జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ. మల్లికార్జున మాట్లాడుతూ దీర్ఘకాలిక వ్యాధులు పై ప్రజలకు గ్రామస్థాయి నుండి విస్తృత అవగాహన కల్పించడం ద్వారా ఎంతో మేలు చేకూరుతుందన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహిస్తున్న ఈ మేళాను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. నగరంలో నిర్వహించిన ఆరోగ్య మేళాకు ఉదయం 9 గంటల నుండే అధిక సంఖ్యలో జనం తరలి వచ్చి వైద్య పరీక్షలు చేయించుకోవడం తో పాటు ఉచితంగా మందులు పొందుతున్నారని తెలిపారు.  ఈ కార్యక్రమంలో డి ఎం హెచ్ ఒ డాక్టర్ విజయలక్ష్మి, జివిఎంసి ప్రధాన వైద్యాధికారి కెఎన్ఎల్జి శాస్త్రి , డి ఎల్ వో డాక్టర్  శారద బాయ్, ఆరోగ్యశ్రీ కో- ఆర్డినేటర్ డాక్టర్ రాజేష్  నెట్ క్యాప్ చెర్మన్ కే కే రాజు ,ఇతర ఆరోగ్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.