అల్లూరిజిల్లా డీపీఆర్వోగా గోవిందరాజులు


Ens Balu
5
Paderu
2022-04-20 16:01:12

అల్లూరి సీతారామరాజు పాడేరుజిల్లా పౌర సంబంధాల అధికారి(డీపీఆర్వో)గా పి.గోవిందరా జులు బాధ్యతలు స్వీకరించారు. ఈ మేరకు రాష్ట్ర పౌరసంబంధాల శాఖ కమిషనర్ ఉత్తర్వులు జారీచేశారు. ఆయన విశాఖ జివిఎంసీ, విజయనగరం జిల్లాలో డివిజనల్ పీఆర్వోగా పనిచేశారు. అయన విశాఖపట్నం, విజయనగరం, పాడేరు ప్రాంతాలపై మంచి పట్టువుంది. కొత్తజిల్లాలలకు డీపీఆర్వోలుగా ప్రభుత్వం అనుభవం వున్న అధికారులనే నియమించడంతో కొత్తజిల్లాల్లోని పరిపాలనకు సంబంధించిన సమాచారం ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మాద్యమాల ద్వారా ప్రజలకు పూర్తిస్థాయిలో సత్వరమే తెలియడానికి  అవకాశం ఏర్పడింది. ఆయన డీపీఆర్వోగా విధుల్లోకి చేరిన అనంతరం పాడేరు ఐటీడీఏ పబ్లిసిటీ ఏపీఓ రాములు, డీపీఆర్వో కార్యాలయ సిబ్బంది ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి పరిచియాలు చేసుకొని శుభాకాంక్షలు తెలియజేశారు. అంతకు ముందు ఆయన జిల్లా కలెక్టర్, జెసి, డీఆర్వోలను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, జిల్లా సమాచారం,  ప్రభుత్వ సంక్షేమ పథకాల విషయాలు, అధికారిక కార్యక్రమాలు సత్వరమే మీడియాకి చేరవేడయంలో శక్తివంచన లేకుండా పనిచేస్తానని చెప్పారు.