ఏయూ సిఇఎస్సిసి సంచాలకులుగా ఆచార్య బాల ప్రసాద్
Ens Balu
3
విశాఖపట్నం
2020-09-17 19:53:54
ఆంధ్రవిశ్వవిద్యాలయంలో నెలకొల్పిన సెంటర్ ఫర్ ఇన్విరాన్మెంట్, సస్టైనబుల్ డెవలప్మెంట్ అండ్ క్లైమేట్ చేంజ్ (సిఇఎస్సిసి) కేంద్రం సంచాలకునిగా ఏయూ సివిల్ ఇంజనీరింగ్ ఆచార్యులు ఎస్.బాల ప్రసాద్ నియమితులయ్యారు. ఈ మేరకు గురువారం ఉదయం వర్సిటీ వీసీ ఆచార్య పి.వి.జి.డి ప్రసాద రెడ్డి నుంచి ఉత్తర్వులను స్వీకరించారు. ఈ సందర్భంగా వీసీ ప్రసాద రెడ్డి మాట్లాడుతూ వర్సిటీ పరంగా పర్యావరణ పరిరక్షణ సంబంధిత అంశాలపై విస్తృత పరిశోధ నలు జరిపే దిశగా ఈ కేంద్రం పనిచేయాలని సూచించారు. వర్తమాన సమాజం ఎదుర్కొంటున్న అనేక సవాళ్లు, ప్రపంచ వ్యాప్తగా జరుగుతున్న పర్యావరణ మార్పులు, సమస్యలపై పరిశోధనలు జరిపి తగిన పరిష్కారాలు చూపే దిశగా కేంద్రం పనిచేయాలన్నారు. తద్వారా ఏయూకి దేశంలోనే మరింత గుర్తింపు ఏర్పాడుతుందన్నారు. పరిశోధన అంటనే ఆంధ్రాయూనివర్శిటీ అనే స్థాయికి తీసుకురావాలని విసి సూచించారు.