భూముల రీసర్వే వేగవంతం కావాలి..
Ens Balu
7
Paderu
2022-04-21 15:04:02
భూముల రీసర్వే త్వరితగతిన పూర్తి చేయాలని సిసిఎల్ఎ కమీషనర్ సాయి ప్రసాద్ సూచించారు. జగనన్న భూ సర్వే, మ్యుటేషన్లు 22ఎల పై జిల్లా కలెక్టర్లు తో గురువారం కమిషనర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నిర్ధేశించిన జగనన్న భూ సర్వే పై నిర్ణయించిన లక్ష్యాలను త్వరితగతిన పూర్తిచేయాలని తెలిపారు. మ్యుటేషన్లుకు సంబంధించి అర్జీలు తిరస్కరించకుండా ప్రభుత్వం జారీ చేసిన సూచనలు ప్రకారం పరిష్కారం చేయాలన్నారు. అదే విధంగా భూ రికార్డులు కూడా వెంటవెంటనే తాజా పరచాలని కోరారు. కలెక్టర్ కార్యాలయంలోని వీడియో కాన్ఫరెన్స్ హాలు నుండి జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ మాట్లాడుతూ జిల్లాలో భూ సర్వే జరుగుతోందని, త్వరిత గతిన పూర్తిచేయడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఈ సమావేశంలో సబ్ కలెక్టర్ అభిషేక్, సిపిఓ శ్రీనివాస రావు, సర్వే అండ్ ల్యాండ్ రికార్డుల శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.