గుడ్ మార్నింగ్ ఆమదాలవలస అంటూ ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి ఇదొక వినూత్నమైన కార్యక్రమమని ఆంధ్రప్రదేశ్ శాసన సభాపతి తమ్మినేని సీతారాం అన్నారు. గుడ్ మార్నింగ్ ఆమదాలవలస కార్యక్రమంలో భాగంగా శుక్రవారం లక్ష్ముడిపేట వార్డు లో ఇంటింట పర్యటించి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. గ్రామంలో లక్ష్మడు పేట నుండి వెంకంపేట వెళ్లే లింక్ రోడ్డు మరియు కాలువలు నిర్మించాలని ప్రజలు స్పీకర్ ను కోరారు. ఈ సందర్భంగా స్పీకర్ తమ్మినేని మాట్లాడుతూ ఇవ్వాళ గుడ్ మార్నింగ్ ఆమదాలవలస కార్యక్రమంలో తిరిగినప్పుడు లక్ష్మడుపేట వార్డులో తిరిగినప్పుడు నాకు ఎక్కువగా వచ్చిన సమస్యలు డ్రైనేజీ, త్రాగునీరు, పారిశుద్ధ్యం నా దృష్టికి వచ్చాయని అధికారులతో మాట్లాడి ఆ సమస్యలను పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. అదే విధంగా కొంతమంది మున్సిపల్ నకొళాయి నీటిని చౌర్యం చేస్తున్నారని మోటర్ల ద్వారా ట్యాంకులకు నింపుతున్నారని దానివలన ఎగువ ప్రాంతాల్లో ఉన్న వారికి మంచి నీరు రాక ఇబ్బంది పడుతున్నారని నా దృష్టికి వచ్చిందని అధికారులు ఆకస్మిక తనిఖీలు చేసి మోటార్ లను తొలగించాలని అధికారులు ఆదేశించామని తెలియజేశారు. సంక్షేమ పథకాలు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నేరుగా వారి అకౌంట్లో జమ చేస్తున్నారని ఈ విధంగా తిరగడం వలన ప్రజల సమస్యలు తెలుస్తాయని దాని ద్వారా జవాబుదారితనం పెరుగుతుందని స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర యువజన విభాగ ప్రధాన కార్యదర్శి తమ్మినేని చిరంజీవి నాగ్, బొడ్డేపల్లి రమేష్ కుమార్, అల్లంశెట్టి ఉమామహేశ్వరరావు, బోర చిన్నo నాయుడు, పొన్నాడ చిన్నారావు, మామిడి ప్రభాకర్, కూన రామకృష్ణ, స్థానిక నాయకులు దుంపల చిరంజీవి, కూన ఆంజనేయులు, బగాది రమణ, బగాది త్రినాధరావు, పొదిలాపు తిరుపతిరావు మున్సిపల్ కమిషనర్ రవి సుధాకర్, మున్సిపల్ ఏఈలు అప్పలనాయుడు,సృజన, ఎలక్ట్రికల్ అధికారులు, హౌసింగ్ అధికారులు, సచివాలయం సిబ్బంది వలంటీర్లు పాల్గొన్నారు.