విధినిర్వహణలో అలసత్వం వహిస్తే..ఇంటికి పంపిస్తా
Ens Balu
2
తిరుపతి
2020-09-17 21:11:06
ప్రభుత్వ సేవల పరిష్కారంలో అలసత్వం వారిని విధుల నుంచి తొలగిస్తామని తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ గిరీష హెచ్చరించారు. గురువారం నగరపాలక సంస్థలో సెక్టోరల్ ఆఫీసర్స్, అడ్మిన్, వెల్ఫేర్ సెక్రటరీ లతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, కార్పోరేషన్ పరిధిలో పెండింగ్లో ఉన్న సమస్యలను సమయానికి పూర్తి చేసి, మీ లాగిన్ లో ఉన్న ఫైల్స్ అన్నీ మీ పై అధికారులకు, (ముందుకు) ఫార్వర్డ్ చేయాలని ఆదేశించారు. నగరంలో 50 వార్డులలో వార్డ్ సెక్రటరీలు షాపుల నీ సర్వే చేసి వాటికి ట్రేడ్ లైసెన్స్ ఉందా లేదా పరిశీలించాలని ఆదేశించారు. లేని వాటికి కొత్తగా దరఖాస్తులు చేయించి కార్యాలయానికి రావాల్సిన ఆదాయాన్ని సమకూర్చాలన్నారు. నగరంలో కొత్తగా కడుతున్న గృహాలు వాటి అనుమతులు ఉన్నాయా లేవా పరిశీలించాలని, లేని వాటిని అధికారుల దృష్టికి తీసుకురావాలని ఆదేశించారు. అడ్మిన్, వెల్ఫేర్ సెక్రటరీలు, సచివాలయ సిబ్బందిని కలుపుకొని అన్ని పనులు చూడాలని, సమస్యల తో వచ్చే ప్రజలతో మర్యాదపూర్వకంగా మాట్లాడి వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలన్నారు. ప్రతి దరఖాస్తులు గడువులోపు పరిష్కరించాలని, వివిధ ప్రభుత్వ పథకాలు సకాలంలో సమర్థవంతంగా ప్రజల ముంగిటకు అందు అందజేయాలని ఆదేశించారు. ఈ సమీక్ష సమావేశంలో అదనపు కమిషనర్ హరిత, ఉప కమిషనర్ చంద్రమౌళీశ్వర రెడ్డి, మేనేజర్ హసిమ్,సెక్టోరల్ ఆఫీసర్లు సేతు మాధవ్, గాలి సుధాకర్, రవి, నీలకంటేశ్వర రావు, మధు బాబు, రవికాంత్, ముని రాజా, కరుణాకర్, నరేష్, రమణ, అడ్మిన్, వెల్ఫేర్ సెక్రటరీలు తదితరులు పాల్గొన్నారు.