కాకినాడ జిల్లాలోని కలెక్టరేట్ లో ఈ నెల 25వ తేదీ ఆఖరి సోమవారాన్ని పురస్కరించి ఉదయం 9-30 గంటల నుంచి మద్యాహ్నం 1-30 గంటల వరకూ స్పందన ప్రజా విజ్ఞాపనల స్వీకరణ కార్యక్రమం, అలాగే మద్యాహ్నం 3 గంటల నుండి ఎస్.సి., ఎస్.టి ప్రత్యేక స్పందన గ్రివెన్స్ సెల్ కార్యక్రమం జరుగుతాయని జిల్లా కలెక్టర్ డా.కృతికా శుక్లా ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాకు చెందిన అర్జీదారులు ఈ అంశాన్ని గమనించి స్పందన కార్యక్రమాలను పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని ఆమె మీడియాకి విడుదల చేసిన ప్రకటన ద్వారా కోరారు.