Sc, St గ్రీవియెన్సు వినియోగించుకోండి


Ens Balu
8
Kakinada
2022-04-23 14:17:07

కాకినాడ జిల్లాలోని కలెక్టరేట్ లో ఈ నెల 25వ తేదీ ఆఖరి సోమవారాన్ని పురస్కరించి ఉదయం 9-30 గంటల నుంచి మద్యాహ్నం 1-30 గంటల వరకూ స్పందన ప్రజా విజ్ఞాపనల స్వీకరణ కార్యక్రమం,  అలాగే మద్యాహ్నం 3 గంటల నుండి  ఎస్.సి., ఎస్.టి ప్రత్యేక స్పందన గ్రివెన్స్ సెల్ కార్యక్రమం జరుగుతాయని జిల్లా కలెక్టర్ డా.కృతికా శుక్లా ఒక ప్రకటనలో తెలిపారు.  జిల్లాకు చెందిన అర్జీదారులు ఈ అంశాన్ని గమనించి స్పందన కార్యక్రమాలను పూర్తిస్థాయిలో  సద్వినియోగం చేసుకోవాలని ఆమె మీడియాకి విడుదల చేసిన ప్రకటన ద్వారా కోరారు.