పాఠశాల భవనాలు పరిపాలనకా సిగ్గు సిగ్గు


Ens Balu
6
Kakinada
2022-04-24 08:35:05

కాకినాడ సాలిపేట గరల్స్ హైస్కూల్ ప్రాంగణంలో 2002న సర్వ శిక్షా అభియాన్ నిధులతో హిందూ స్పెషల్ ఎలిమెంటరీ స్కూల్ కు నిర్మించిన భవనాన్ని పాఠశాలల విలీనంతో విద్యాశాఖ ఉప తనిఖీ అధికారి కార్యాలయంగా వినియోగించడాన్ని కాకినాడ పౌర సంక్షేమ సంఘం తప్పుబడుతోంది. విద్యానిలయాలను విద్యకు మాత్రమే వినియగియోగించాలని, అంతేతప్పా పరిపాలనా సౌలభ్యం కోసం ప్రభుత్వ కార్యాలయాలుగా వినియోగించడం విద్యాహక్కు చట్టానికి విరుద్దమని పౌర సంఘం కన్వీనర్ దూసర్లపూడి రమణ రాజు ఆరోపించారు. తక్షణమే విద్యాశాఖ అధికారులు ఆ పాఠశాల భవనాన్ని ఖాళీ చేసి.. దానిని బాలికలతరగతి గదులకు వినియోగిం డిమాండ్ చేశారు. హైస్కూల్ మేడ మీద గదులను విద్యాశాఖ ఆధీనంలోవుంచడం ఎంత వరకూ భావ్యం కదాని హితవు పలికారు. ఈ విషయంలో వక్తలు ప్రజా ప్రతినిధులు స్పందించాలని కోరారు. చెట్లక్రింద తరగతుల నిర్వాహాణ జరుగుతున్నందుకు ఎమ్మెల్యే ఎంపీ మంత్రు లు కౌన్సిల్ ప్రజలకు క్షమాపణ చెప్పాలన్నారు. హైస్కూల్ స్థలంలో వున్న భవనాన్ని తరగతి గదులకు అప్పగించాల ని విద్యాశాఖ ఉప కార్యాలయానికి ఇచ్చిన కౌన్సిల్ అనుమతులు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. జిల్లా కలెక్టర్ విజిట్ చేసి సాలిపేట గరల్స్ హైస్కూల్  సమస్యలు శాశ్వతంగా పరిష్కరించే జిల్లా అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

సిఫార్సు