కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రికి ఘనస్వాగతం


Ens Balu
3
Vizianagaram
2022-04-25 16:11:12

 కేంద్ర మంత్రి డా. మన్ సుఖ్ మాండవీయ కు సోమవారం విశాఖ విమానాశ్రయంలో ఘస స్వాగతం లభించింది. ఈ మేరకు విజయనగరం జిల్లా కలెక్టర్ ఏ.సూర్యకుమారి పుష్పగుచ్చం అందజేసి  ఆహ్వానం పలికారు. విశాఖ విమానాశ్రయం నుంచి నేరుగా విజయనగరంలోని జిల్లా పరిషత్ గెస్ట్ హౌస్ కి చేరుకున్న అన్నారు.  జిల్లా రెవెన్యూ అధికారి ఎం.గణపతి రావు, ఆర్.డి.ఓ. భవానీ శంకర్, జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డా ఎస్వీ రమణ కుమారి తదితరులు స్వాగతం పలికారు. అనంతరం పోలీసుల నుండి గౌరవ వందనం స్వీకరించారు.  కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి రాత్రికి ఇక్కడే బసచేస్తారు. మంగళవారం ముందుగా ప్రకటించిన షెడ్యుల్ ప్రకారం వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు.  ఆయన వెంట జిల్లా అధికార యంత్రాంగం కూడా కార్యక్రమాల్లో పాల్గొంటుందని జిల్లా కలెక్టర్ ఈ మేరకు ప్రకటించారు.