ఆధారాలు చూపిస్తే మంత్రిపదవని వదిలేస్తా..
Ens Balu
3
అలూరు
2020-09-18 15:42:20
రాష్ట్రంలో సంచనలం స్రుష్టించి ఈఎస్ఐ స్కాంలో ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు టిడిపి అన్ని ప్రయత్నాలు చేస్తుందని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గుమ్మనూ రు జయరాం ఆరోపించారు. ఈఎస్ఎఐ స్కాంలో ప్రమేయం ఉందని మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు చేసిన ఆరోపణలపై జయరాం తీవ్రంమండిపడ్రారు. శుక్రవా రం ఆలూరులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.. అయ్యన్నపాత్రుడు చెబుతున్నట్లు తన కుమారుడి పక్కనున్న బెంజ్ కారు తమది కాదని, దాని పక్కన కేవలం ఫోటో మాత్రమే దిగాడని వివరించారు. హెలికాఫ్టర్, ట్రైన్ పక్కన ఫోటోలు తీసుకుంటే మనదే అవుతుందా అంటూ చమత్కరించారు. కారు మాదే అని రుజువు చేస్తే మంత్రి పదవికి రాజీనామా చేస్తానని సవాలు విసిన మంత్రి టీడీపీ నాయకులకు మతి భ్రమించి మాట్లాడుతున్నారని, గత ప్రభుత్వంలో జరిగిన అవినీతిపై ఎందుకు స్పందించడంలేదని నిలదీశారు. చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్న సమయంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు ఏమైనా పదవులు ఇచ్చారా అని ప్రశ్నించారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు మాయల ఫకీర్ లాంటివారని అన్నారు. ఎవరిని ఏఏ శాఖలో నియమించుకోవాలో అక్కడ తన వారిని నియమించుకొని వాటాలు దండిగా వసూలు చేసుకున్నారన్నారు.