పురోగతి లేకపోతే ఉపేక్షించేది లేదు


Ens Balu
3
Srikakulam
2022-05-10 10:39:45

శ్రీకాకుళం జిల్లాలో జలకళ పనుల్లో పురోగతి సాధించాలని కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్ పేర్కొన్నా రు.మంగళవారం జిల్లా కలెక్టర్  చాంబర్ లో  జలకళ సంబంధిత పనులపై ఆయన సమీ క్షించారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జళకల పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. జిల్లాలో నిర్వహిస్తున్న జలకళ పనులపై ఆరా తీశారు.  డ్వామా ప్రోజెక్ట్ డైరెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 2296 బోర్లు తీసేందుకు జియాలజిస్ట్లు ఇప్పటికే సర్వే నిర్వహించారని తెలుపగా జియాలజిస్ట్లు వారీగా వివరాలను కలెక్టర్ అడుగగా వివరాలు పిడి వద్ద లేకపోవడం పై పూర్తి డేటాలతో సమీక్షకు హాజరు కావాలన్నారు. పనులు అపడం కాకుండా పరిష్కారానికి కావలసిన అనుమతుల నిమిత్తం ఫైల్స్ పంపించాలన్నారు. కాంట్రాక్టర్స్ తో సమావేశం ఏర్పాటు చేసి పనులు వేగవంతం అయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పనుల పురోగతికి సహకరించని సిబ్బందికి వేటు తప్పదన్నారు. ఏమైనా సమస్యలు తెలిపితే పరిష్కారం చూపిస్తామన్నారు.  కాంట్రాక్టర్లు పనులు త్వరితగతిన పూర్తి చేయాలని, బిల్లులు సకాలంలో అందేలా చర్యలు చేపడతామన్నారు. ఈ సమావేశంలో డ్వామా పి.డి. ఎం.రోజా రాణి, జియాలజిస్ట్లు, కాంట్రాక్టర్లు, తదితరులు పాల్గొన్నారు.