పుస్తకపఠనం ఉన్నత విద్యకు తొలిమెట్టు


Ens Balu
14
Visakhapatnam
2022-05-18 16:11:39

ప్రతి విద్యార్థికి పుస్తక పఠనం మంచి లక్షణమని,  వేసవి సెలవుల్లో సబ్జెక్ట్ తో పాటు వివిధ రకాల పుస్తకాలు చదవడం అలవాటు చేసుకోవాలని నగర మేయర్ గోలగాని వెంకట హరి కుమారి అన్నారు. బుధవారం విశాఖపట్నం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన  వేసవి విజ్ఞాన శిబిర కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిదిగా విచ్చేసిన నగర మేయర్ గోలగాని వెంకట హరి కుమారి  మాట్లాడుతూ ఆటలతో, పాటలతో పాటు ప్రతి విద్యార్థికి పుస్తక పఠనం మంచి లక్షణమని,  వేసవి సెలవుల్లో సబ్జెక్ట్ తో పాటు మీకు వివిధ రకాల పుస్తకాలు చదవడం అలవాటు చేసుకోవాలని విద్యార్దులకు సూచించారు. వివిధ రకాల పుస్తకాలు చదవడంతో లోక జ్ఞానం వస్తుందన్నారు.  ఈ శిబిరాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసిందని దీనిని ప్రతి ఒక్కరూ వినియోగించు కోవాలన్నారు.  జిల్లా గ్రంధాలయ సంస్థ ఛైర్పర్సన్ కొండా రమాదేవి మాట్లాడుతూ పుస్తక పఠనం తో విజ్ఞానాన్ని పెంపొందించుకోవాలని అన్నారు. విద్యార్ధులకు ఇస్తున్న ఈ సుదీర్ఘ వేసవి విరామాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. రాష్ట్రంలో గ్రంధాలయ వ్యవస్థను పటిష్ట పరిచేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డిజటల్ లైబ్రరీ లను ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. వేసవిలో విద్యార్దులు టివి, పోన్లలకు భానిసలు కాకుండా సమాజిక విజ్ఞానం పెంపోదించుకోనేందుకు వేసవి విజ్ఞాన శిబిరాలు ఉపయెగపడతాయన్నారు. ఆంధ్రప్రదేశ్ పౌర గ్రంథాలయ శాఖ వారి ఆధీనంలో ఉన్న అన్ని గ్రంథాలయాలలో పాఠశాల విద్యార్థులకు వేసవి విజ్ఞాన శిబిరాలు ఈ రోజు నుండి జూన్ 30వ తేదీ వరకు జరుగుతాయని తెలిపారు. ఈ వేసవి శిబిరంలో కధలు వినుట, చెప్పడం, పుస్తక పఠనము, పుస్తక సమీక్షలు, పెద్దల నుంచి విన్న అముద్రిత కథలు చెప్పుట, చిత్రలేఖనము, పేపర్ ఆర్ట్, థియేటర్ ఆర్ట్ వంటి సృజనాత్మక కార్యక్రమాలు ప్రతి రోజూ ఉదయం 8.00 గం॥ నుంచి మధ్యాహ్నం 12.00 గం॥ల వరకూ నిర్వహించడం జరుగుతుందన్నారు. కావున విద్యార్థులు ఈ వేసవి శిబిరాలకు హాజరై సృజనాత్మకతను పెంచుకొనేలా ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు విద్యార్థులను ప్రోత్సహించవలసినదిగా కోరారు. అలాగే గ్రంథాలయాల్లో త్రాగునీరు మౌలిక వసతులు కల్పించడం జరిగిందని వివరించారు. తల్లిదండ్రులు పిల్లలను గ్రంధాలయాలకు పంపినప్పుడు దగ్గరుండి తీసుకురావాలని తీసుకు వెళ్లాలని  కోరారు. అంతకు ముందు జ్యోతి ప్రజ్వలన చేసి, సమ్మర్ క్యాంపు  గోడ పత్రిక ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఎం ఎల్ సి వరుదు కళ్యాణి, మత్స్య శాఖ చైర్మన్ కోలగురువులు,  జిల్లా గ్రంధాలయ కార్యదర్శి ఎన్ లలిత, సంబందిత  అధికారులు మరియు పిల్లలు వారి తల్లదండ్రులు పాల్గొన్నారు.
సిఫార్సు