అంతర్వేదిలో ప్రారంభమైన నూతర రథ నిర్మాణం..


Ens Balu
3
Antervedi Pallipalem
2020-09-19 15:12:27

అంతర్వేదిలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారికి శనివారం నూతర రధాన్ని నిర్మించే పనులకు దేవాదాయ ధర్మాదాయ అధికారు శ్రీకారం చుట్టారు. ఈమేరకు వనివా రం ఈ రోజు నూతన రథం నిర్మాణ పనులు వేదపండితుల మంత్రోచ్ఛారణల మధ్య పనులు ప్రారంభం అయ్యాయి. వచ్చే స్వామి వారి కల్యాణోత్సవం నాటికి  స్వా మివారు నూతన రథం పై నిలపాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఆగ మేఘాలపై రథం నిర్మాణాన్ని చేపట్టింది. ఇందులో భాగంగా  కొత్తపేట నియోజకవర్గం రావుల పాలెం వెంకటసాయి  టింబర్ డిపోలో ఉన్న కలపను గుర్తించారు. ఈ నూతన రధం నిర్మాణానికి ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం రూ. 95 లక్షలు కేటాయించింది. ఈ కొత్త రథనం పనులను దేవాదాయశాఖ రాష్ట్ర అధికారిణి బ్రమరాంబ సారధ్యంలో ప్రారంభించారు.  62 ఏళ్ల చరిత్రగల పాత రథం నమూనాలోనే కొత్త రధాన్ని కూడా నిర్మించడానికి అన్ని కొలతలూ తీసుకున్నారు నిర్మాణ దారులు. స్వామివారి రథం దగ్గం అయిన తరువాత వరుసగా రాష్ట్రంలో ఏదోమూల హిందూ దేవాలయాల్లో దుండగులు తెగబడుతూనే ఉన్నారు. కుట్రకోణంలో దర్యాప్తు చేస్తున్న ప్రభుత్వం హిందువుల మనోభావాలకు ఎక్కడా భంగం వాటిల్లకుండా ప్రత్యేకంగా దర్యాప్తు చేపడుతుంది. దీనిపై బీజేపి తీవ్ర స్థాయిలో ఆందోళనలు చేస్తూనే వుంది..