28 నుంచి ఏయూ డిగ్రీ చివరి సెమిష్టర్ పరీక్షలు..
                
                
                
                
                
                
                    
                    
                        
                            
                            
                                
Ens Balu
                                 4
                            
                         
                        
                            
Visakhapatnam
                            2020-09-19 15:31:03
                        
                     
                    
                 
                
                    ఆంధ్రవిశ్వవిద్యాలయం డిగ్రీ చివరి సెమిష్టర్ పరీక్షలను సెప్టెంబరు 28 నుంచి అక్టోబరు 9వ తేదీ వరకు నిర్వహిస్తామని యూజీ పరీక్షల డీన్ ఆచార్య డి.వి.ఆర్ మూ ర్తి  తెలిపారు. ఏయూలో శనివారం ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఉదయం బిఎస్సీ కోర్సుకు, మద్యాహ్నం నుంచి బిఏ, బికాం కోర్సులకు పరీక్షలు జ రుగుతాయన్నారు. విశాఖపట్నం, విజయనగరం జిల్లాలలోని ఏయూ పరిధిలో డిగ్రీ విద్యార్థులు పరీక్షలకు సిద్దం కావాలని ఆయన సూచించారు. పూర్తి సమాచారం ఏయూ వెబ్సైట్ నుంచి పొందాలన్నారు. ఈ నెల 21వ తేదీన  ఏయూ అనుబంధ డిగ్రీ కళాశాలల ప్రిన్సిపాల్స్తో పరీక్షల నిర్వహణపై వీసీ ఆచార్య పి.వి.జి.డి ప్రసా దరెడ్డి వెబినార్ నిర్వహిస్తారన్నారు. ఈ వెబినార్ లో చాలా అంశాలు చర్చకు వస్తాయని చెప్పారు. కరోనా నేపథ్యంలో విద్యార్ధులు సామాజిక దూరం పాటించాల న్నా రు. ఖచ్చితంగా పరీక్షల సమయంలోనూ మాస్కులు ధరించే పరీక్షలకు హాజరుకావాలని స్పష్టం చేశారు.