ఏఎంసీలో డా.క్రిష్ణబాబు సేవలు వెలకట్టలేనివి


Ens Balu
3
Visakhapatnam
2022-07-01 15:43:19

విశాఖలోని ఆంధ్రా మెడికల్ కాలేజీలో వైఎస్ ప్రిన్సిపాల్ డా.జి.క్రిష్ణబాబు సేవలు వెలకట్టలేనివని డా.ఎంవీవీ మురళీమోహన్ అన్నారు. శుక్రవారం ఆంధ్రామెడికల్ కాలేజీలో ఈ సందర్భంగా ఉద్యోగ విరమణ చేసి క్రిష్ణబాబును పలువురు వైద్యులు ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మురళీ మోహన్ మాట్లడుతూ, ఎన్నో ఏళ్ల చరిత్రగల ఏఎంసీలో వైస్ ప్రిన్సిపాల్ గా ఉత్తమ సేవలు అందించారని అన్నారు. ఈ క్రమంలోనే ఎందరినో వైద్యులుగా తీర్చిదిద్దారని కొనియాడారు. ప్రభుత్వ ఉద్యోగాలనికి ఉద్యోగ విరమణ ఉన్నా.. వైద్యునిగా జీవితాంతం ప్రజలకు సేవలు అందించడానికి వీలుపడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో డా.పద్మశ్రీ, డా.నాగమణి, డా.దేవీమాధవి, డాక్టర్ పి.జె.శ్రీనివాసల్ పలువురు మెడికోలు పాల్గొన్నారు.