స్కానింగ్ సెంటర్లుకి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ తప్పనిసరి..


Ens Balu
3
Visakhapatnam
2020-09-19 18:39:49

విశాఖజిల్లాలోని మెడికల్ స్కానింగ్ సెంటర్లు సెప్టెంబరు 21 నుంచి కేంద్రం వివరాలు ఆన్ లైన్ లో రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని జిల్లా వైద్యఆరోగ్యశాఖ అధికారిణి డా.కె.విజయలక్ష్మి సూచించారు. శనివారం విశాఖలో ఆమె మీడియాతో మాట్లాడుతూ, ప్రభుత్వ ఆదేశాల మేరకు విశాఖపట్నం జిల్లాలో ఈ నెల 21 నుండి స్కానింగ్ సెంటర్లు రిజిస్ట్రేషన్, రెన్యువల్ ప్రక్రియ మరియు ఇతర సేవలు ఆన్ లైన్ లో మాత్రమే నమోదు చేసుకోవాలన్నారు.  ప్రభుత్వ, ప్రైవేటు స్కానింగ్ సెంటర్లు pcpndt.ap.gov.in వెబ్ సైట్ లోకి లాగాన్ అయ్యి నిర్ణీత ద్రువీకరణ పత్రాలతో రిజిస్ట్రేషన్, రెవిన్యువల్ చేయించుకోవాలన్నారు. కేంద్రాల్లో ఆన్ లైన్ లో రిజిస్ట్రేషన్ చేయించుకోకపోతే, తనిఖీల్లో భారీగా అపరాద రుసుము విధించడం జరుగుతుందన్నారు. ఈ ప్రక్రియకు సంబంధించిన నిబయ నిబంధనలు కూడా ప్రభుత్వం వెబ్ సైట్ లోనే పొందుపరిచిందని డిఎంహెచ్ఓ వివరించారు.