పౌష్టికాహార ప్రాముఖ్యత తెలుసుకోవాలి


Ens Balu
8
Vizianagaram
2022-07-11 10:07:31

విజయనగరంలోని మహారాజ ఆసుపత్రిలో  పౌష్టికాహార పునరావాస కేంద్రం (ఎన్. ఆర్.సి) లో పౌష్టికాహారం పై బాలింతలకు అవగాహనా సదస్సు నిర్వహించారు. జిల్లా కలెక్టర్ సూర్య కుమారి ఆదేశాల మేరకు సామ్, మాం, తక్కువ బరువున్న పిల్లలకు ఎన్. ఆర్.సి లో  పౌష్టికాహారం  అందించడం ఐ.సి.డి.ఎస్ సూపర్ వైసర్లకు, తల్లులకు శిక్షణ నిచ్చారు. చిన్న పిల్లల వైద్యులు డా.గౌరీ శంకర్, పౌష్టికాహార నిపుణులు స్వర్ణ ఎలాంటి ఆహారం పౌష్టికారం, ఏ ఆహారం లో ఎలాంటి విటమిన్లు, న్యూట్రియాంట్ లు ఉంటాయి, పిల్లలకు ఎలా తినిపించాలో వివరించారు. ఈ కార్యక్రమంలో 11 మంది తల్లులు వారి పిల్లలతో కలసి హాజరయ్యారు.  ఈ శిక్షణా కార్యక్రమం లో పాల్గొన్న ఐ.సి.డి.ఎస్ పి.డి శాంత కుమారి మాట్లాడుతూ ఈ శిక్షణా కార్యక్రమం మంగళవారం కూడా పెద్దాసుపత్రి లో నిర్వహించనున్నట్లు  తెలిపారు. అదే విధంగా జిల్లా అంతటా విడతల వారీగా పి హెచ్ సి వైద్యులు, సీడీపీఓల అధ్వర్యం లో నిర్వహిస్తున్నట్లు తెలిపారు.