సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తం


Ens Balu
9
Vizianagaram
2022-07-12 11:37:53

సీజనల్ వ్యాధులు ప్రబలకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యాధికారులకు జిల్లా కలెక్టర్ సూర్య కుమారి ఆదేశించారు. ఫీవర్ సర్వే జరుపు తున్నప్పుడు  ఏ.ఎన్. ఎం లు ప్రాధమికంగా వాడే మందులను వెంట తీసుకొని వెళ్లాలని సూచించారు. వైద్య , స్త్రీ శిశు అభివృద్ధి శాఖల అధికారులతో  మంగళవారం  కలెక్టర్ టీం కాన్ఫరెన్స్  నిర్వహించి సీజనల్ వ్యాధులు, ఫీవర్ సర్వే,  నీతీ అయోగ్ సూచీ ల పై పలు సూచనలు చేశారు. ముఖ్య0గా  తల్లి పాలు, కుటుంభ నియంత్రణ, సిజేరియన్, సాలిడ్ ఫుడ్ అందించే అంశాల పై వైద్యులు, ఏ.ఎన్.ఎం లు, అంగన్వాడీ, వాలంటీర్ల సహకారం తో ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. గర్భిణీ ల నమోదు శత శాతం జరగాలని, వారికి ఐ.డి ల జారీ కూడా చేయాలని అన్నారు. అంగన్వాడీ సెంటర్స్ లొనే వండి పెట్టాలని, అప్పుడు మాత్రమే పౌష్టికాహారం తీసుకుంటున్నది లేనిది ప్రత్యక్షంగా పర్యవేక్షించే అవకాశం ఉంటుందని,  ఇళ్లకు రేషన్ గానీ, బాక్స్ లు గాని పంపరాదని స్పష్టం చేశారు. హై రిస్క్ గర్భిణీ లను వైద్యులే అంగన్వాడీ కేంద్రాలకు రిఫర్ చేయాలని అన్నారు.  సామ్, మాం పిల్లలు ఎక్కువగా ఉన్నారని, వీరి పై ప్రత్యేక శ్రద్ధ చూపాలని అన్నారు.  ప్రధానంగా పిల్లలకు 10 నెలలు వచ్చే వరకు ఘనాహారం ఇవ్వడం లేదని, దీనివలనే పిల్లల పెరుగుదల తక్కువగా ఉంటుందని అన్నారు. ఆరు నెలలకే అన్న ప్రాసన చేసి ఘనాహారం అందించాలని, దీని పై అవగాహన కలిగించాలని తెలిపారు.  చిన్న ప్రయత్నం తోనే  మంచి ఫలితాలు సాధించగలమని, ఆ దిశ గా ప్రతి ఒక్కరూ పని చేయాలని తెలిపారు. ఈ సమావేశంలో  డి ఎం హెచ్ ఓ డా.రమణ కుమారి, ఐ.సి.డి.ఎస్ పిడి శాంత కుమారి, వైద్యులు పాల్గొన్నారు.