13,14 తేదీల్లో నాక్ కమిటీ పర్యటన
Ens Balu
4
Tirupati
2022-07-12 13:43:06
తిరుపతి ఎస్వీ ఆర్ట్స్ కళాశాలలో జూలై 13,14 వ తేదీలలో నాక్ కమిటీ పర్యటిస్తుందని టీటీడీ జెఈవో సదా భార్గవి తెలిపారు. ఎస్వీ ఆర్ట్స్ కళాశాలలో జరుగుతున్న ఏర్పాట్లను జెఈవో మంగళవారం అధికారులతో కలిసి పరిశీలించారు. కళాశాల లోని అన్ని ల్యాబ్ లు తరగతి గదులు మైదానం పరిశీలించారు . న్యాక్ కమిటీకి వివరించే అంశాల గురించి అధ్యాపకులు ,విద్యార్థులతో చర్చించి వారికి పలు సూచనలు సలహాలు ఇచ్చారు . కళాశాల కు సంబంధించి రూపొందించిన పవర్ పాయింట్ ప్రజంటేషన్ చూశారు. ఈ సందర్బంగా జెఈవో మాట్లాడుతూ, కళాశాలలో జరుగుతున్న మౌళిక వసతుల అభివృద్ధి పనులను పూర్తి చేశారన్నారు. నాక్ కమిటీ సభ్యులకు ఆయా విభాగాల అధిపతులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వారి విభాగానికి సంబంధించిన అంశాలు వివరిస్తారని తెలిపారు. అదేవిధంగా కళాశాలలోని హిస్టరీ విభాగం అద్భుతమైన ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసిందని చెప్పారు. ఇప్పటికే కళాశాలకు ఏ గ్రేడ్ గుర్తింపు ఉందని, నాక్ ఏ ప్లస్ గ్రేడ్ గుర్తింపునకు అధ్యాపకులు, విద్యార్థులు కృషి చేస్తున్నారని తెలిపారు. డిఈవో గోవిందరాజన్, కళాశాల ప్రిన్సిపాల్ డా.నారాయణమ్మ తదితరులు పాల్గొన్నారు.