సమ్మెవల్ల ఇబ్బందులు లేకుండా చర్యలు


Ens Balu
5
Kakinada
2022-07-12 15:19:54

పారిశుద్ధ్య విభాగంలో పనిచేస్తున్న ఔట్‌సోర్సింగ్‌ కార్మికుల సమ్మె కారణంగా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటున్నామని కాకినాడ నగరపాలక సంస్థ అదనపు కమిషనర్‌ సీహెచ్‌ నాగనరసింహారావు చెప్పారు. మంగళవారం ఆయన రామకృష్ణారావుపేట, చిన్నమార్కెట్, మెయిన్‌రోడ్డు, కలెక్టరేట్, జీజీహెచ్, ఈట్‌స్ట్రీట్, రమణయ్యపేట ప్రాంతాల్లో పర్యటించి సమ్మె నేపద్యంలో పారిశుద్ధ్య పనులను పర్యవేక్షించారు. ఇంటింటికి చెత్త సేకరణ జరుగుతున్న తీరును పరిశీలించారు. అక్కడి శానిటరీ ఇన్స్‌పెక్టర్లకు పలు సూచనలు ఇచ్చారు. అనంతరం ఏడీసీ నాగనరసింహారావు మాట్లాడుతూ సమ్మె నేపద్యంలో చెత్త, కూరగాయల వ్యర్థాలతో చెత్త అధికంగా ఉత్పత్తి అవుతుందని, అక్కడి వ్యాపారులు సొంతంగా అదనపు కార్మికులను ఏర్పాటు చేసుకుని రోడ్డుపక్కన వేయకుండా సహకరించాలని కోరారు. మెయిన్‌రోడ్డులోని వ్యాపారులు కూడా ఇదే రీతిలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. హూపర్‌టిప్పర్‌ వాహనాలు, కంపాక్టర్లు యధావిధిగా ఇళ్ళకు వస్తాయని, ప్రజలు చెత్తను రోడ్లపై వేయకుండా వాహనాల వద్దకు అందజేయాలని విజ్ఞప్తి చేశారు. సమ్మెవల్ల చెత్త సేకరణకు అంతరాయం కలగకుండా ఇప్పటికే 80v మందిని అదనపు కార్మికులను ఏర్పాటు చేశామని, మరో 60 మందిని కూడా తీకుని ఎలాంటి సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో ఆయన వెంట కార్పొరేటర్రోకళ్ల సత్యనారాయణ, సానిటరీ ఇన్స్పెక్టర్లు జిలాని, రాజేంద్రప్రసాద్ ఉన్నారు.