ధవళేశ్వరం వద్ద 3వ ప్రమాద హెచ్చరిక జారీ


Ens Balu
2
Rajamahendravaram
2022-07-15 06:34:50

తూర్పుగోదారి జిల్లాలోని ధవళేశ్వరం కాటన్ బ్యారేజికి అంతకంతకూ  వరద ప్రవాహం పెరుగుతుండటంతో 3వ ప్రమాద హెచ్చరిక జారీ జేశారు. ప్రస్తుతం కాటన్ బ్యారేజ్ ప్రస్తుత ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 19.23 లక్షల క్యూసెక్కులుగా ఉంది. ఎంత నీరు వస్తే అంతే నీటికి అధికారులు సముద్రంలోకి విడిచి పెడుతున్నారు. వరద ప్రవాహం 22 నుంచి 23 లక్షల క్యూసెక్కులు చేరుకునే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. దీనితో కంట్రోల్ రూమ్ నుంచే రాష్ట్ర విపత్తుల శాఖ స్పెషల్ సిఎస్ జి.సాయిప్రసాద్, ఎండి బి. ఆర్ అంబేద్కర్ లు స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. తక్షణ సహాయక చర్యల్లో మొత్తం 9 ఎన్డీఆర్ఎఫ్, 10 ఎస్డీఆర్ఎఫ్ బృందాలు పాల్గొంటున్నాయి. ఇప్పటికే వరదల కారణంగా ఏలూరు జిల్లా వేలేరుపాడు మండలం కొయిడ , కటుకూరు గ్రామలకు రాకపోకలు నిలిచిపోయాయి. అయితే అటు వరదల్లో చిక్కుపోయిన వారికి ఆహారాన్ని అందించేందుకు డా.బి.ఆర్ అంబేద్కర్ విపత్తుల సంస్థ హెలీకాప్టర్లను రంగంలోకి దించింది. వాటి ద్వారా బాధితులకు ఆహారాన్ని అందిస్తున్నారు. సాయంత్రానికి మూడవ ప్రమాద హెచ్చరిక జారీచేసే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. హెచ్చరిక వస్తే 6 జిల్లాల్లోని 42 మండలాల్లో  524 గ్రామాలపై ప్రభావం చూపే అవకాశం వుంటుందని అధికారులు పేర్కొంటున్నారు. కాగా ముందస్తు చర్యల్లో భాగంగా..అన్ని జిల్లాల కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, జిల్లా ఎస్పీలను విపత్తుల నిర్వహణ సంస్థ అప్రమత్తం చేసింది. గోదావరి పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం ప్రత్యేక బులిటెన్ ద్వారా కోరింది.