అప్పన్నను దర్శించుకున్న మంత్రి బుగ్గన


Ens Balu
3
Simhachalam
2022-07-16 07:54:08

విశాఖలోని సింహాచలం లక్ష్మీ నరసింహస్వామి(సింహాద్రి అప్పన్న)ని రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి శనివారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా  పూర్ణకుంభంతో ఈఓ, అర్చక స్వాముల తో కలిసి సంప్రదాయంగా స్వాగతం పలికారు. అంతరాలయంలో అర్చకులు మంత్రి పేరున ప్రత్యేక పూజలు చేశారు. కప్పస్తంభం ఆలింగనం చేసుకున్న మంత్రి గోదాదేవి సన్నిధిలో అర్చకుల మంగళహారతులు స్వీకరించారు. బేడామండపమలో మంత్రిని అర్చకులు ఆశీర్వదించారు స్వామివారి చిత్రపటం, శేషవస్త్రాలు, ప్రసాదాలను మంత్రి కి ఈవో అందించారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం అధికారులు, సిబ్బంది, వైఎస్సార్సీపీ నాయకులు పాల్గొన్నారు.