విశాఖ దక్షిణ వైఎస్సార్సీపీలో నూతన ఉత్తేజం..!
Ens Balu
4
Visakhapatnam
2020-09-20 11:37:13
విశాఖ దక్షిణంలో వైఎస్సార్సీపీకి నూతన ఉత్తేజం మొదలైంది...టిడిపి ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ తోపాటు తన ఇద్దరు కుమారులతో వైఎస్సార్సీపీ తీర్ధం పు చ్చుకోవడం, బలమైన సామాజిక వర్గం మొత్తం సహకరించడం పార్టీకి కలిసొచ్చింది. అంతేకాకుండా డేరింగ్ అండ్ డేషింగ్ ఎమ్మెల్యేగా పేరున్న వాసుపల్లికి జనం లోనూ, నాయకుల్లోనూ మంచిపేరే వుంది. దానికితోడు కార్యదీక్షుడిగా, విద్యా, వ్యాపారవేత్తగా అన్ని వర్గాల్లో ముందున్నారు. అలాంటి వ్యక్తి అధికారపార్టీ వైఎస్సా ర్సీపీ లోకి రావడంతో యూత్ మొత్తం ఫుల్ జోష్ తో ఉన్నారు. ప్రభుత్వ చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలు, ప్రజల్లో పార్టీకి వున్న పేరు అన్నీ వాసుపల్లికి బాగా కలిసొ చ్చాయి. వాసుపల్లి వెనుక వున్న సామాజిక వర్గం కూడా ఇపుడు పార్టీకి కూడా బలంగామారింది. కార్యకర్తలు, నాయకులు కూడా గణేష్ కుమార్ తీసుకున్న నిర్ణయానికి మంచి ప్రోత్సాహం ఇవ్వడంతో రెట్టించిన ఉత్సాహంతో పనిచేయడానికి ఆయన వెనుక వున్న కేడర్ కూడా ముందుకు వస్తుంది. అటు వాణిజ్య విభాగంలోనూ మంచి నాయకులు వుండటం కూడా ఈ నియోజకవర్గానికి కలిశొచ్చే అంశంగా చెప్పవచ్చు. ఎన్నివిధాలుగా చూసుకున్నా వాసుపల్లి వైఎస్సార్సీపీలోకి రావడం అన్నివర్గాల కు కలిసొస్తుందనే భావన ప్రతీ ఒక్కరిలోనూవుంది. ఇదే ఉత్సాహంతో ముందుకెళితే నియోజవకర్గంలో నూతన ఉత్తేజం చిరస్థాయిగా నిలిచిపోతుందనడంలో సందేహం లేదు..!