ఆధార్ సీడింగ్ లకు చర్యలు తీసుకోవాలి


Ens Balu
2
Srikakulam
2022-07-28 10:14:12

ఆధార్ లో మార్పులు చేర్పులు, తొలగింపులకు చర్యలు తీసుకోవాలని చీఫ్ ఎలక్ట్రోరల్ ఆఫీసర్ ముఖేష్ కుమార్ మీనా జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. కొత్తగా సవరించిన ఫారమ్‌లు, ఆధార్ నంబర్ సేకరణ, తదితర వాటిపై జిల్లా కలెక్టర్లతో గురువారం ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కేంద్ర ఎన్నికల కమీషన్ ఆదేశాల మేరకు మరణాలు, డబుల్ ఎంట్రీ ఉన్న వాటిని  ముందుగా నిర్థారణ చేసుకొని తొలగించేందుకు చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఆధార్ సీడింగ్ చేయాలని చెప్పారు. ప్రణాళికా బద్దంగా తేదీలు నిర్ణయించుకొని చేయాలన్నారు. ఇంటింటి సర్వే పై బిఎల్ఓలకు అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్ మాట్లాడుతూ ఆధార్ సీడింగ్ కార్యక్రమం ఆగస్టు 4వ తేదీ నుండి ప్రారంభిస్తామన్నారు. వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ తో పాటు జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం. విజయ సునీత విజయవాడ నుండి పాల్గొన్నారు. జిల్లా రెవెన్యూ అధికారి ఎం. రాజేశ్వరి, రెవిన్యూ డివిజనల్ అధికారి బొడేపల్లి శాంతి, ఉప కలెక్టర్ జి. జయదేవి, అర్బన్ తహసీల్దార్ వెంకటరావు, తదితరులు పాల్గొన్నారు.