జివిఎంసీ పరిధిలో తొలి రోజు పరీక్షలు ప్రశాంతం..


Ens Balu
2
Visakhapatnam
2020-09-20 17:32:08

మహావిశాఖ నగరపాలక సంస్థ పరిధిలో గ్రామ / వార్డు సచివాలయాల వ్రాతపరీక్షల తీరును కమిషనర్ డా.స్రిజన స్వయంగా పరిశీలించారు. ఆదివారం పరీక్షలు జరుగుతున్న కేంద్రాల్లో ఆమె పర్యటించి అక్కడ పరీక్షల ఏర్పాట్లును అధికారుల ద్వారా అడిగి తెలుసుకున్నారు. అంతేకాకుండా జివిఎంలో ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ కేంద్రం నుంచి కూడా ఆమె పరీక్షల తీరును పర్యవేక్షించారు. ఏ కేంద్రంలోనూ ఎలాంటి ఇబ్బందులు రాకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. సెప్టెంబర్ – 20 నుండి 26వ సచివాలయ పరీక్షలు జరుగుతున్నందు, పరీక్షా కేంద్రాల్లో మంచినీరు, మందులు, దివ్యాంగులకు వీల్ చైర్స్ తదితర ఏర్పాట్లు పక్కాగా ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ఆరు రోజుల పాటు అధికారులు దగ్గరుండి పరీక్షాకేంద్రాల్లో కావాల్సిన సౌకర్యాలను దగ్గరుండి చూసి, పరీక్షలను విజయవంతం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ వెంట సంబందిత క్లస్టర్ అధికారులు, రూటు అధికారులు, కేంద్రాల ప్రత్యేక అధికారులు, తదితరులు పాల్గొన్నారు.