ఆశ్రమ పాఠశాల సమస్య పరిష్కరించాలి


Ens Balu
8
Paderu
2022-08-16 13:58:11

ఆశ్రమ పాఠశాల సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఐ టి డి ఎ పి ఓ ఆర్. గోపాలకృష్ణ అధికారులను ఆదేశించారు. మంగళవారం మండలంలోని  దిగుమోదపుట్టు ఆశ్రమ పాఠశాలను ఆకస్మిక ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులతో మాట్లాడి ఆశ్రమ పాఠశాలలోని సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మరుగుదొడ్లకు రన్నింగ్ వాటర్ లేదని విద్యార్థులు దృష్టికి తీసుకొచ్చారు. వాటర్ సమస్య ను వెంటనే పరిష్కరించాలని ప్రధానోపాధ్యాయుడు, ఏ టి డబ్ల్యూ ఓ లను ఆదేశించారు. యాక్షన్ టేకెన్ రిపోర్టు సమర్పించాలని సూచించారు. పదో తరగతి విద్యార్థులకు భౌతిక శాస్త్రాన్ని బోధించారు. విద్యార్థులకు నాణ్యమైన మెనూ అందించాలని పేర్కొన్నారు. పాఠశాలలో డ్రాపవుట్లు  ఎక్కువగా ఉన్నారని తగిన చర్యలు చేపట్టాలని గిరిజన సంక్షమశాఖ డిడి,atwo ను ఆదేశించారు. అనంతరం తుంపాడ,చింతలవీది గ్రామ సచివాలయం లను తనిఖీ చేశారు. తుంపాడ వి ఆర్ ఓ ఎం. కొండమ్మ సక్రమంగా విధులకు హాజరు కాలేదని పరిశీలించి కావడం లేదనిక్రమ శిక్షణా చర్యలు తీసుకోవాలనిఎంపీడీఓకు సూచించారు. విలేజ్ సర్వేయర్ డిప్యూటేషన్ రద్దు చేయాలని సబ్ కలెక్టర్ను ఆదేశించారు. తుంపాడ 13వతేది నుండి హాజరు పట్టిక లో సంతకాలు చేయకుండా విధులకుపంచాయతీ కార్యదర్శి ఎన్. మత్త్య రాజు హాజరు కాలేదని తగిన చర్యలు తీసుకోవాలని ఎం.పి.డి. ఓ ని అదేశించారు.