తూర్పు గోదావరి జిల్లాలోని కొవ్వూరు నియోజక వర్గ స్థాయి స్పందన కార్యక్రమం ఆగస్ట్ 22 సోమవారం కొవ్వూరు మునిసిపల్ కార్యాలయంలో నిర్వహిస్తున్నామని జిల్లా కలెక్టర్ డా. కె. మాధవీలత శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజల వద్దకే వెళ్ళి వారి సమస్యలు పరిష్కారం దిశగా వచ్చే సోమవారం నాడు కొవ్వూరు నియోజక వర్గ స్థాయిలో స్పందన కార్యక్రమం చేపట్టాలని నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు. అందులో భాగంగా ఆగస్ట్ 22 వ తేదీ సోమవారం కొవ్వూరు లో "స్పందన" ఏర్పాటు చేశామన్నారు. అన్ని శాఖల జిల్లా అధికారులు కొవ్వూరు లో జరిగే స్పందన కార్యక్రమంలో ఉదయం పాల్గొని ఫిర్యాదులు స్వీకరిస్తారని కలెక్టర్ మాధవీలత తెలిపారు. కొవ్వూరు నియోజకవర్గం చెందిన కొవ్వూరు, చాగల్లు, తాళ్లపూడి ప్రజలు ఈ స్పందన కార్యక్రమంకు హాజరు కావాలని కలెక్టర్ మాధవీలత కోరారు. జిల్లా కలెక్టర్, జేసీ, ఇతర జిల్లా అధికారులు ద్వారా ఉదయం 10.30 నుంచి మ.1.00 వరకు ఫిర్యాదులను ప్రజల నుంచి స్వీకరిస్తామని కలెక్టర్ తెలిపారు.
రాజమహేంద్రవరం జిల్లా కలెక్టరేట్ లో స్పందన..
రాజమండ్రిజిల్లా కలెక్టరేట్ లో ప్రజల నుంచి సంబందించిన శాఖల రెండవ స్థాయి అధికారులు హాజరై యధాతధంగా స్పందన దరఖాస్తులు స్వీకరిస్తారని జిల్లా కలెక్టర్ మాధవీలత పేర్కొన్నారు. ప్రతి వారం తరహాలోనే సోమవారం హర్లిక్స్ ఫ్యాక్టరీ సమీపంలోని ఎన్ఎసి భవనంలోని కలెక్టరేట్ నకు ఆర్టీసి బస్టాండ్ నుంచి ఆర్టీసి ఉచిత బస్సు సర్వీసు ఉ.9 నుంచి మ.2 వరకు నడుపుతున్నట్లు ఆమె తెలిపారు.