బ్ర‌హ్మోత్స‌వాల భ‌ద్ర‌తా ఏర్పాట్ల‌పై స‌మీక్ష‌


Ens Balu
5
Tirupati
2022-08-30 11:39:51

శ్రీ‌వారి సాల‌క‌ట్ల బ్ర‌హ్మోత్స‌వాల భ‌ద్ర‌తా ఏర్పాట్ల‌పై టిటిడి విజిలెన్స్‌, పోలీసు అధికారులు క‌లిసి స‌మీక్ష నిర్వ‌హించారు. తిరుమ‌ల‌లోని పిఏసి-4లో గ‌ల క‌మాండ్ కంట్రోల్ రూమ్ స‌మావేశ మందిరంలో ఈ స‌మీక్ష జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా శ్రీ‌వారి బ్ర‌హ్మోత్స‌వాల తొలిరోజైన సెప్టెంబ‌రు 27న ధ్వ‌జారోహ‌ణం సంద‌ర్భంగా ముఖ్య‌మంత్రివర్యులు గౌ. శ్రీ. వైఎస్.జగన్ మోహన్ రెడ్డి ప‌ర్య‌ట‌న కోసం బందోబ‌స్తు, వాహ‌న‌సేవ‌ల‌కు విచ్చేసే భ‌క్తులకు పార్కింగ్ ఏర్పాట్లు, దొంగ‌త‌నాలు జ‌రుగ‌కుండా చ‌ర్య‌లు, క్యూలైన్ల‌లో తోపులాట లేకుండా ఏర్పాట్లు, ఘాట్ రోడ్ల‌లో కూంబింగ్‌, రాత్రి గ‌స్తీ విధులు, అవ‌స‌ర‌మైన భ‌ద్ర‌తా ప‌రిక‌రాలు తెప్పించుకోవ‌డం, క్యూలైన్లు, బ్యారీకేడ్ల ఏర్పాటు, వ‌స‌తి స‌ముదాయాల వ‌ద్ద పోగ‌యిన వ్య‌ర్థాల తొల‌గింపు త‌దిత‌ర అంశాల‌పై స‌మీక్షించారు.

          అద‌న‌పు ఎస్పీ  మునిరామ‌య్య, విజివో  బాలిరెడ్డి, ఇఇ  జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి, ట్రాఫిక్ డిఎస్పీ  వేణుగోపాల్‌, సిఐలు  జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి,  చంద్ర‌శేఖ‌ర్‌, ఎవిఎస్వోలు  సురేంద్ర‌,  సాయిగిరిధ‌ర్‌,  మ‌నోహ‌ర్‌,  శివ‌య్య ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.
సిఫార్సు