తిరుమలలో శాస్త్రోక్తంగా శ్రీ వరాహస్వామి జయంతి


Ens Balu
20
Tirumala
2022-08-30 11:41:15

ఆదివరాహక్షేత్రమైన తిరుమలలోని శ్రీ భూ వరాహస్వామివారి ఆలయంలో మంగ‌ళ‌వారం ఉదయం వరాహ జయంతి శాస్త్రోక్తంగా జరిగింది.         ఇందులో భాగంగా ఉదయం కలశస్థాపన, కలశ పూజ, పుణ్యాహవచనం చేప‌ట్టారు. అనంత‌రం వేద‌మంత్రాల న‌డుమ మూల‌వ‌ర్ల‌కు పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్లు, ప‌సుపు, చందనంతో విశేషంగా అభిషేకం నిర్వ‌హించారు. శ్రీ‌వారి ఆల‌య ప్ర‌ధానార్చ‌కుల్లో ఒక‌రైన  వేణుగోపాల దీక్షితులు ఈ అభిషేకం చేశారు.  ఈ కార్యక్రమంలో ఆల‌య డెప్యూటీ ఈవో ర‌మేష్‌బాబు త‌దిత‌రులు పాల్గొన్నారు.