పిఠాపురంలో జిల్లాస్థాయి స్పందన


Ens Balu
8
Kakinada
2022-09-01 16:58:07

జిల్లా స్ధాయి స్పందన ప్రజా విజ్ఞాపనల స్వీకరణ కార్యక్రమాన్ని సెప్టెంబర్ 5న  పిఠాపురం లోని రెడ్డి రాజా కళ్యాణ మండపంలో  ఉదయం 10 గంటల నుండి నిర్వహిస్తామని జిల్లా కలెక్టర్ డా.కృతికా శుక్లా ఒక ప్రకటనలో తెలియజేసారు. జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్  విజ్ఞాపనలను పిఠాపురంలో   స్వీకరిస్తామని కాకినాడ జిల్లాకు చెందిన  అర్జీదారులు అందరూ ఈ అంశాన్ని  గమనించి సెప్టెంబర్ 5వ తేదీన తమ అర్జీలను పిఠాపురంలో నిర్వహించే  స్పందన కార్యక్రమంలో సమర్పించాలని ఆమె కోరారు. అలాగే వివిధ శాఖల జిల్లా అధికారులు అందరూ  సెప్టెంబర్ 5వ తేదీ సోమవారం ఉదయం 9-30 గంటలకే పిఠాపురంలో నిర్వహించే స్పందన గ్రివెన్స్ సెల్ కార్యక్రమానికి  విధిగా హాజరు కావాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు.