వైఎస్ఆర్ జీవిత సాఫల్య పురస్కారానికి దరఖాస్తుల ఆహ్వానం


Ens Balu
15
Parvathipuram
2022-09-26 15:56:19

డా.వైఎస్ఆర్ జీవిత సాఫల్య పురస్కారానికి దరఖాస్తులను ఈ నెల 30వ తేదీ లోగా  సమర్పించాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ తెలిపారు. ఈ మేరకు సోమ వారం ఒక ప్రకటన విడుదల చేశారు. 2022 సంవత్సరానికి సంబంధించి అర్హులైన యువత నుంచి “వైఎస్ఆర్ జీవిత సాఫల్య పురస్కారాలు, వైఎస్ఆర్ అఛీవ్ మెంట్” అవార్డులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు  తెలిపారు. కళలు, సాంఘిక కార్యక్రమాలు, ప్రజావ్యవహారాలు, సైన్స్ అండ్ ఇంజినీరింగ్, వాణిజ్యం, పరిశ్రమలు, ఔషధములు, సాహిత్యం, విద్య, పౌరసేవ, క్రీడలు, ఇతర జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో విశిష్ట ప్రతిభ కనబరిచిన వ్యక్తులు తగు ఆధారాలతో (వార్తాపత్రికల క్లిప్పింగ్లు, ఫొటోలు జతపరిచి) దరఖాస్తు చేయాలని సూచించారు. గ్రామ, మురికివాడల అభివృద్ధిలో చేసిన కృషి, స్వచ్చంద సేవాసంస్థలు, లాభాపేక్ష లేని సంస్థ లకు సంబంధించిన వ్యక్తులు వ్యక్తిగతంగా దరఖాస్తు చేసుకోవాలన్నారు. 

సంఘాలు,  సంస్థలకు సంబంధించిన అభ్యర్థులు ప్రకృతి, చారిత్రక విషయాల్లో చేసిన సేవలకు సంబంధించి ఉండాలన్నారు. అభ్యర్థులు దరఖాస్తును ఒక పేజీకి మించకుండా తమ వివరాలు, చిరునామా, ఫోన్ నంబర్, ఇ-మెయిల్ వివరాలు, ఎంచుకున్న విభాగంనకు సంబంధించిన వివరాలు జతచేసి secy-political@ap.gov.in మెయిల్ కు 30వ తేదీ లోగా సమర్పించాలని ఆయన వివరించారు. అర్హులైన వ్యక్తులు, సంస్థలు దరఖాస్తులు సమర్పించాలని కోరారు.