జాప్యం లేకుండా అర్జీలను పరిష్కరించాలి


Ens Balu
2
2022-10-10 10:35:10

అర్జీల పరిష్కారంలో జాప్యం  లేకుండా త్యరితగతిన పరిష్కరించాలని అధికార్లను జిల్లా జాయింటు కలెక్టరు జె వి మురళి ఆదేశించారు. సోమవారం పశ్చిమగోదావరి జిల్లా భీమవరం కలెక్టరేట్ లో సమస్యలు పరిష్కారానికి  వచ్చిన ప్రజల నుంచి  జాయింట్ కలెక్టర్  వినతులను స్వీకరించారు. ఈ సందర్భంగా జెసీ మాట్లాడుతూ, ప్రజల నుండి వచ్చిన అర్జీలను గడువులోగా  పరిష్కరించే విధంగా జిల్లా, మండల స్థాయి అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు.స్పందనలో అందిన అర్జీలను రీఓపెన్ కాకుండా స్పష్టతతో పరిష్కరించాలని ఆయన అధికారులను ఆదేశించారు. స్పందన పరిష్కారం చేసేటప్పుడు ఫిర్యాదు దారునితో మాట్లాడుతున్న ఫోటో అప్ లోడ్ చేయాలని,సమస్య పరిష్కారం కాకముందు ఉన్న ఫోటో , పరిష్కారం అయిన తర్వాత ఫోటో లు  అప్ లోడ్ చేయని ధరఖాస్తు పరిష్కరించబడినదిగా పరిగణనలోకి తీసుకోవడం జరగదని జాయింట్ కలెక్టరు జె వి మురళి అన్నారు. 

స్పందన కార్యక్రమంలో ఇంచార్జ్ జిల్లా రెవెన్యూ అధికారి దాసి రాజు, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ కుమారి డి.అఖిల, జిఎస్ డబ్ల్యూఓ కె.సి.హెచ్. అప్పారావు, డి.ఎస్.పి ఎస్.బి.వి. సుభాకర్, డిపిఓ ఎం.నాగలతలు పాల్గొని ప్రజల నుంచి  అర్జీలు స్వీకరించారు. స్పందన కార్యక్రమంలో అందిన అర్జీలలో దివ్యాంగుల సదరన్ సర్టిఫికెట్లు, పింఛన్లు, హౌసింగ్, భూమి తగాదాలు, భూమి రికార్డు ఆన్లైన్, తదితర సమస్యల పై 190  వినతులు అందాయి.  ఈ కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.