విజయనగరం జిల్లాలో 2.1సెంమీ వర్షపాతం..
Ens Balu
1
Vizianagaram
2020-09-22 13:08:03
విజయనగరం జిల్లాలో మంగళవారం భారీగా కురిసన వర్షాలు 2.1 సెంమీగా నమోదు అయ్యింది. జిల్లాల్లో 9 మండలాల్లో అత్యధికంగా కురిసాయి. కాగా గుమ్మలక్ష్మీ పురంలో 34.2 మిల్లీమీటర్లు, గరుగుబిల్లిలో 10.4 మిల్లీమీటర్లు, శీతానగరంలో 6.8 మిల్లీ మీటర్లు వర్షపాతం నమోదైందని జిల్లా కలెక్టర్ డా.హరి జవహర్ లాల్ తెలియజేశారు. వర్షాలు అధికంగా కురుస్తున్నందున అత్యవసర సర్వీసులు అందించేందు అధికారులు సిద్ధంగా ఉండాలని, రెయిన్ ఫాల్ ఎప్పటికప్పుడు నమోదు చేయడంతోపాటు, జిల్లా, డివిజన్ కేంద్రాల్లోని కంట్రోల్ రూమ్ లకు వచ్చిన సమాచారాన్ని జిల్లా కేంద్రాలకి తెలియజేయాలని అధికారులను ఆదేశించారు. గ్రామసచివాలయాలు, వార్డు సచివాలయాల్లోని పారిశుధ్య, వైద్యసిబ్బంది అందుబాటులో వుంటూ తాజా పరిస్థితిని తెలియజేయాలని ఆదేశించారు. ఎవరికీ ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలని తహశీల్దార్లు, ఎంపీడీలను కలెక్టర్ ఆదేశించారు.