సచివాలయ పరీక్షలకు 3రోజు ఉదయం 75.25% హాజరు
Ens Balu
4
Anantapur
2020-09-22 13:33:26
అనంతపురం జిల్లాలో సచివాలయ ఉద్యోగాల భర్తీ కొరకు చేపట్టిన మూడవ రోజు నిర్వహించిన రాత పరీక్షల్లో 75.25 శాతం మంది అభ్యర్థులు హాజరయ్యారని జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు తెలిపారు. మంగళవారం అనంత నగరం ప్రధాన కేంద్రం లోఉదయం నుండి మధ్యాహ్నం వరకు జరిగిన కేటగిరి - 3 గ్రేడ్ -2 వార్డు పారిశుద్ధ్యం కార్యదర్శి, పర్యావరణ కారదర్శి , ఉద్యోగాలకు సంబంధించిన పరీక్షకు 4320 మంది అభ్యర్థులు హాజరు కావాల్సి ఉండగా, 3251 మంది హాజరయ్యారని ,1069 మంది పరీక్షకు గైర్హాజరుకాగా , 75.25 శాతం హాజరు నమోదయ్యిందన్నారు. అనంతపురం ప్రధాన కేంద్రం లోని 24 పరీక్ష కేంద్రాల్లో మూడవ రోజు అభ్యర్థులు వ్రాత పరీక్ష రాశారన్న జిల్లా కలెక్టర్ అభ్యర్ధులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ప్రశాంత వాతవరణంలో పరీక్షలు రాసేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్టు వివరించారు. వైద్య సిబ్బంది, మందులు, మంచినీరు, వికలాంగులకు వీల్ చైర్స్ అన్నింటినీ సమకూర్చనట్టు చెప్పారు.