ఆహార పంపిణీలో ప్రమాణాలు పాటించాలి


Ens Balu
14
2022-10-12 08:59:28

జాతీయ ఆహార భద్రత చట్టాన్ని మరింత పటిష్టం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తుందని రాష్ట్ర ఆహార కమిషన్ చైర్మన్ సిహెచ్.విజయ ప్రతాప్ రెడ్డి అన్నారు. బుధవారం విశాఖ కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా జాయింట్ కలెక్టర్ కె.ఎస్.విశ్వనాథ న్ తో కలిసి విశాఖపట్నం, అనకాపల్లి జిల్లా శాఖలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆహార కమిషన్ చైర్మన్ సిహెచ్.విజయప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి విద్యార్థి, చిన్నారులకు పౌష్టికాహారం అందించాలన్నదే ఈ ప్రభుత్వ లక్ష్యమని, దానికి అనుగుణంగా పోషక విలువలు కలిగిన ఆహారం అందించడం జరుగుతుందన్నారు. పేదలు, విద్యార్థులు, గర్భిణులకు ఆహార భద్రత కింద అమలు చేస్తున్న కార్యక్రమాలు ప్రభుత్వం నిర్ధేశించిన ప్రమాణాల మేరకు అందాలని అన్నారు. 

ఈ విషయమై రెండు రోజులుగా విశాఖపట్నం , అనకాపల్లి జిల్లాల్లో పర్యటించి అంగన్‌వాడీ కేంద్రాలు, వసతి గృహాలు, రేషన్‌ దుకాణాలు,యం.ఎల్.ఎస్  గోదాములు తనిఖీ చేశామన్నారు. అంగన్‌వాడీ వ్యవస్ధ మరింత మెరుగుపడాలన్నారు. కేంద్రాల్లో విద్యార్థుల హాజరు సక్రమంగా నమోదు చేయాలన్నారు. పిల్లల జ్ఞాపకశక్తి ,ఆరోగ్యాన్ని మరింత పెంపొందించేందుకు మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా ఫోర్టిఫైడ్‌ రైస్‌ అందించడం జరుగుతుందని అన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఏడు జిల్లాల్లో ఈ బియ్యాన్ని అందిస్తున్నామని,  త్వరలోనే రాష్ట్రమంతా సరఫరా చేయడం జరుగుతుందని అన్నారు. పేద, బడుగు బలహీన వర్గాలకు ప్రభుత్వం కల్పిస్తున్న హక్కును అందరూ వినియోగించుకోవాలని తెలియజేశారు. మొబైల్ రేషన్ వాహనాల ద్వారా అందిస్తున్న బియ్యం కు బదులుగా డబ్బు పంపిణీ వంటి అవకతవకలకు పాల్పడినట్లయితే సంబంధిత రేషన్ డీలర్ల పై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ఐసిడిఎస్ అధికారులు అంగన్వాడీ కేంద్రాలను ఎప్పటికప్పుడు తనిఖీలు చేయాలన్నారు.

    జాయింట్ కలెక్టర్ కె.ఎస్.విశ్వనాథన్ మాట్లాడుతూ ఆహార భద్రత చట్టం 2013 అమలుకు అధికారులు కృషి చేయాలని, కమిషన్ చైర్మన్ క్షేత్రస్థాయి తనిఖీలలో గుర్తించిన లోటుపాట్లును సంబంధిత శాఖల అధికారులు తక్షణమే సరిచేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో  ఆహార కమిషన్ మెంబర్ కాంతారావు, స్టేట్ ఫుడ్ కమిషన్ డిప్యూటీ డైరెక్టర్ పి.సురేష్ ,విశాఖపట్నం డీఎస్ఓ సూర్య ప్రకాష్ రావు, అనకాపల్లి జిల్లా డీఎస్ఓ కె.వి.ఎల్.ఎన్ ప్రసాద్, విశాఖ డీఈవో చంద్రకళ , అనకాపల్లి డీఈవో రామలింగేశ్వరరావు , ఐసిడిఎస్ పిడి  వెంకటేశ్వరి, పౌరసరఫరాల శాఖ  డిఎం, విశాఖపట్నం ఐ. రాజేశ్వరి , డిఎం అనకాపల్లి శ్రీలత , ఈడీ బీసీ కార్పొరేషన్ శ్రీదేవి, ఎంఈఓ లు సంబంధిత జిల్లా అధికారులు పాల్గొన్నారు.
సిఫార్సు