ఉత్తరాంధ్రాలో 18,745లో దరఖాస్తుల సమర్ఫణ


Ens Balu
9
2022-10-13 14:51:06

ఉత్తరాంధ్రాలోని  శ్రీకాకుళం-విజయనగరం-విశాఖపట్నం పట్టభద్రుల నియోజకవర్గం నందు గల 6 జిల్లాల లోను తేది 13.10.2022 నాటికి ఆన్ లైన్ మరియు ఆఫ్ లైన్ ద్వారా. (1) శ్రీకాకుళం 3231, (2) విజయనగరం - 4149, (3) పార్వతీపురం మన్యం - 735, (4) అల్లూరి సీతారామ రాజు - 923, (5) విశాఖపట్నం – 7047, (6) అనకాపల్లి-266) వెరసి మొత్తం 18,745 ఓటరు దరఖాస్తులు సమర్పించారని జిల్లా కలెక్టర్ డా.ఎ మల్లిఖార్జున తెలియజేశారు.

 శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, విశాఖపట్నం, అనకాపల్లి మరియు అల్లూరి సీతారామ రాజు జిల్లాలలో సాధారణ నివాసులైన అర్హులైన వ్యక్తులు తమ పేర్లను నిర్దేశించిన పారమ్ 18లో సపోర్టింగ్ డాక్యుమెంట్లతో పాటు తేది 07.11.2022 లో గా ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ (జిల్లా రెవెన్యూ అధికారి, విశాఖపట్నం) లేదా అసిస్టెంట్ ఎలక్ట్రోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ (శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, విశాఖపట్నం, అనకాపల్లి మరియు అల్లూరి సీతారామ రాజు జిల్లలో గల అందరు శాసనసభ నియోజకవర్గం ఓటరు నమోదు అధికారులు, రెవిన్యూ డివిజినల్ అధికారులు, జోనల్ కమిషనర్లు, తహసీల్దారు మరియు మండల పరిషత్ డవలప్మెంట్ అధికారులు) వారి కార్యాలయాల్లో కాని www.ceoandhra.nic.in వెబ్సైట్ నందు ఆన్ లైన్ ద్వారా కానీ ఫారం-18. ధరఖాస్తులు సమర్పించాలని సూచించారు.

అర్హులైన వ్యక్తులందరూ ఈ సదుపాయాన్ని ఉపయోగించుకొని ఓటర్ల జాబితాలో తమ పేర్లు నమోదు చేసుకోవాలని, గ్రాడ్యుయేట్ నియోజకవర్గం యొక్క తప్పులు లేని ఎలక్టోరల్ రోల్ తయారీలో ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారికి అవసరమైన సహకారాన్ని అందించాలని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు.