పార్వతీపురం ఐటిడిఎ ప్రాజెక్టు అధికారిగా బాధ్యతలు స్వీకరించిన సి.విష్ణు చరణ్ జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ ను మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో శుక్రవారం జిల్లా కలెక్టర్ ను కలుసుకున్న ప్రాజెక్టు అధికారిని ఐటిడిఎ అభివృద్ధిలో మరింత ముందడుగు వేయించాలని జిల్లా కలెక్టర్ సూచించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు అందించడంలో కీలకంగా వ్యహరించాలన్నారు. ఐటీడీఏ పరిధిలోని అగ్ని గ్రామ సచివాలయాల ద్వారా ప్రజలకు సేవలు అందించే విధంగా పనిచేయాలని కలెక్టర్ పీఓకి సూచించారు. కాగా విష్ణు చరణ్ నరసాపురం సబ్ కలెక్టర్ గా చేస్తూ బదిలీపై ప్రాజెక్టు అధికారిగా వచ్చారు.