ఆరోఓఎఫ్ఆర్ కి వినతులు స్వీకరణ..


Ens Balu
3
పార్వతీపరుం ఐటిడిఏ
2020-09-22 18:23:21

అక్టోబరు 02 నుంచి రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలన నుసరించి భూమి లేని గిరిజన రైతులను గుర్తించి పట్టాలు అందించేందుకు చర్యలు చేపట్టడం జరిగిందని పార్వతీపు రం ప్రాజెక్ట్ అధికారి ఆర్.కూర్మనాథ్ పేర్కొన్నారు. అందులో భాగంగా ప్రాజెక్ట్ అధికారి మాట్లాడుతూ, సెప్టెంబర్ 24వ తేదీ నుండి సబ్ ప్లాన్ మండల తహశీల్దార్ కార్యా లయాలో, ప్రతి గ్రామ సచివాలయాలో ప్రతి రోజూ ఉదయం 10.30 నుండి సాయంత్రం 5.00 గంటల వరకు వినతులు స్వీకరణ కార్యక్రమం నిర్వహించడం జరుగు తుందన్నారు. భూమి లేని గిరిజన రైతులు ఆర్.ఓ.ఎఫ్.ఆర్.కి సంబందించిన సమస్యలు వుంటే మీ గ్రామానికి దగ్గరలో వున్న మీ సచివాలయంలో గాని మండల తహశీల్దార్ కార్యాలయంలో గాని వినతులు అందజేయాలని తెలిపారు. ఈ మేరకు ఏజెన్సీలోని అన్ని గ్రామసచివాలయాల్లోని వాలంటీర్లు ఈ మేరకు గిరి రైతులకు ఈ విషయాన్ని తెలియజేయాలన్నారు. తద్వారా భూమిలేని గిరిజనులు దరఖాస్తు చేసుకోవడానికి వీలుంటుందన్నారు.