రాజమండ్రిలో వైభవంగా గోదావరి హారతి


Ens Balu
13
Rajamahendravaram
2022-11-07 15:31:29

రాజమండ్రిలో కార్తీకమాసం రెండవ సోమవారాన్ని పురస్కరించుకొని గోదావరి హారతుల కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ గోదావరి హారతులు కార్యక్రమంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కె. నారాయణ స్వామి పాల్గొని తిలకించారు. సోమవారం రాత్రి పుష్కర్ ఘాట్ వద్ద అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించిన గోదావరి హరతుల కార్యక్రమంలో  రాజమండ్రి పార్లమెంట్ సభ్యులు మార్గని భరత్ రామ్, అనపర్తి  శాసన సభ్యులు సత్తి సూర్య నారాయరెడ్డి దంపతులు, మునిసిపల్ కమిషనర్ కె. దినేష్ కుమార్ దంపతులు, స్థానిక ప్రజా ప్రతినిదులు, 
వివిధ కార్పొరేషన్ చైర్మన్ లు, చైర్ పర్సన్, పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు.