విజయనగరం జిల్లాలో సోమవారం కలెక్టరేట్ నందు నిర్వహించిన స్పందన కు ప్రజల నుండి 155 వినతులు అందాయి. వీటిలో వైద్య శాఖకు 32, డి.ఆర్.డి.ఏ కు 17, డి.పి.ఓ కు 5, హౌసింగ్ కు 7, మున్సిపల్ శాఖ కు 13 అందగా అత్యధికంగా రెవిన్యూ కు సంబంధించి 74 వినతులు, మాన్యువల్ గా 7 అందాయి. ముఖ్యంగా సదరం, పింఛన్లు, ఇళ్ల స్థలాలు, భూ సమస్యలు, గృహాల కోసం విజ్ఞప్తులు వచ్చాయి. ఈ వినతులను జిల్లా కలెక్టరు ఎ. సూర్య కుమారి, జె.సి మయూర్ అశోక్, ఉప కలెక్టర్లు సుదర్శన దొర, సూర్యనారాయణ, పద్మావతి స్వీకరించారు. రీ ఓపెన్ వినతుల అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టి అర్ధవంతమైన సమాధానాలను ఇవ్వాలని కలెక్టర్ సూచించారు.